ల్యాండ్ బోర్డర్ నుంచి ఒమనీయులకు ఎంట్రీ
- August 31, 2021అబుధాబి: ల్యాండ్ బోర్డర్ మీదుగా ఒమన్ పౌరులు తమ దేశంలోకి వచ్చేందుకు యూఏఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. కొత్త ప్రోటోకాల్ మేరకు తమ దేశంలోకి రావాలనుకుంటున్న ఒమన్ పౌరులకు పోర్టులు, సరిహద్దులు & ఫ్రీ జోన్ల భద్రత, నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) జనరల్ అథారిటీ స్వాగతించింది పలుకుతున్నట్లు వెల్లడించింది. అయితే..కోవిడ్ నేపథ్యంలో ప్రయాణికులు తప్పనిసరిగా ప్రయాణానికి 48 గంటల్లోపు చేయించుకున్న పీసీఆర్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణికుల వాహనం సరిహద్దుకు చేరుకోగానే ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తారు. యూఏఈలో నాలుగు రోజుల కన్నా ఎక్కువ ఉంటే నాలుగో రోజున, 8 రోజులు ఉంటే 8వ రోజున మరోసారి పీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు