ల్యాండ్ బోర్డర్ నుంచి ఒమనీయులకు ఎంట్రీ

- August 31, 2021 , by Maagulf
ల్యాండ్ బోర్డర్ నుంచి ఒమనీయులకు ఎంట్రీ

అబుధాబి: ల్యాండ్ బోర్డర్ మీదుగా ఒమన్ పౌరులు తమ దేశంలోకి వచ్చేందుకు యూఏఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. కొత్త ప్రోటోకాల్ మేరకు తమ దేశంలోకి రావాలనుకుంటున్న ఒమన్ పౌరులకు పోర్టులు, సరిహద్దులు & ఫ్రీ జోన్‌ల భద్రత,  నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NCEMA) జనరల్ అథారిటీ  స్వాగతించింది పలుకుతున్నట్లు వెల్లడించింది. అయితే..కోవిడ్ నేపథ్యంలో ప్రయాణికులు తప్పనిసరిగా ప్రయాణానికి 48 గంటల్లోపు చేయించుకున్న పీసీఆర్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణికుల వాహనం సరిహద్దుకు చేరుకోగానే ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తారు. యూఏఈలో నాలుగు రోజుల కన్నా ఎక్కువ ఉంటే నాలుగో రోజున, 8 రోజులు ఉంటే 8వ రోజున మరోసారి పీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com