ఇండియా టూ కువైట్ డైరెక్ట్ ఫ్లైట్స్..వారానికి 760 సీట్ల కేటాయింపు
- August 31, 2021
ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్లను అనుమతించిన కువైట్ ప్రయాణికుల సంఖ్యపై క్లారిటీ ఇచ్చింది. ప్రతి రోజు 10 వేల మంది విదేశీ ప్రయాణికులు దేశంలోకి వచ్చేందుకు కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో భారత్ కు సంబంధించి ప్రయాణికుల పరిమితులను వెల్లడించింది. ఆమోదించిన 10 వేల సీట్లలో భారత్ నుంచి వచ్చే విమానాల్లో వారానికి 760 సీట్లను కేటాయిస్తున్నట్లు పౌర విమానయాన సంస్థ తెలిపింది. కేటాయించిన కోటాలో భారత విమానయాన సంస్థలకు 380, కువైట్ విమానయాన సంస్థలకు 380 సీట్లను అలాట్ చేసింది. కువైట్ కోటాలోని 380 సీట్లలో కువైట్ ఎయిర్ వేస్ కు 230 సీట్లు, జజీరా ఎయిర్ వేస్ కు 150 సీట్లు కేటాయించింది. ఇదిలాఉంటే భారత్ టూ కువైట్ డెరెక్ట్ ఫ్లైట్స్ షెడ్యూల్ వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM









