ఇండియా టూ కువైట్ డైరెక్ట్ ఫ్లైట్స్..వారానికి 760 సీట్ల కేటాయింపు
- August 31, 2021
ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్లను అనుమతించిన కువైట్ ప్రయాణికుల సంఖ్యపై క్లారిటీ ఇచ్చింది. ప్రతి రోజు 10 వేల మంది విదేశీ ప్రయాణికులు దేశంలోకి వచ్చేందుకు కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో భారత్ కు సంబంధించి ప్రయాణికుల పరిమితులను వెల్లడించింది. ఆమోదించిన 10 వేల సీట్లలో భారత్ నుంచి వచ్చే విమానాల్లో వారానికి 760 సీట్లను కేటాయిస్తున్నట్లు పౌర విమానయాన సంస్థ తెలిపింది. కేటాయించిన కోటాలో భారత విమానయాన సంస్థలకు 380, కువైట్ విమానయాన సంస్థలకు 380 సీట్లను అలాట్ చేసింది. కువైట్ కోటాలోని 380 సీట్లలో కువైట్ ఎయిర్ వేస్ కు 230 సీట్లు, జజీరా ఎయిర్ వేస్ కు 150 సీట్లు కేటాయించింది. ఇదిలాఉంటే భారత్ టూ కువైట్ డెరెక్ట్ ఫ్లైట్స్ షెడ్యూల్ వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
తాజా వార్తలు
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!







