ఇండియా టూ కువైట్ డైరెక్ట్ ఫ్లైట్స్..వారానికి 760 సీట్ల కేటాయింపు
- August 31, 2021ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్లను అనుమతించిన కువైట్ ప్రయాణికుల సంఖ్యపై క్లారిటీ ఇచ్చింది. ప్రతి రోజు 10 వేల మంది విదేశీ ప్రయాణికులు దేశంలోకి వచ్చేందుకు కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో భారత్ కు సంబంధించి ప్రయాణికుల పరిమితులను వెల్లడించింది. ఆమోదించిన 10 వేల సీట్లలో భారత్ నుంచి వచ్చే విమానాల్లో వారానికి 760 సీట్లను కేటాయిస్తున్నట్లు పౌర విమానయాన సంస్థ తెలిపింది. కేటాయించిన కోటాలో భారత విమానయాన సంస్థలకు 380, కువైట్ విమానయాన సంస్థలకు 380 సీట్లను అలాట్ చేసింది. కువైట్ కోటాలోని 380 సీట్లలో కువైట్ ఎయిర్ వేస్ కు 230 సీట్లు, జజీరా ఎయిర్ వేస్ కు 150 సీట్లు కేటాయించింది. ఇదిలాఉంటే భారత్ టూ కువైట్ డెరెక్ట్ ఫ్లైట్స్ షెడ్యూల్ వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు