ఇండియా టూ కువైట్ డైరెక్ట్ ఫ్లైట్స్..వారానికి 760 సీట్ల కేటాయింపు
- August 31, 2021
ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్లను అనుమతించిన కువైట్ ప్రయాణికుల సంఖ్యపై క్లారిటీ ఇచ్చింది. ప్రతి రోజు 10 వేల మంది విదేశీ ప్రయాణికులు దేశంలోకి వచ్చేందుకు కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో భారత్ కు సంబంధించి ప్రయాణికుల పరిమితులను వెల్లడించింది. ఆమోదించిన 10 వేల సీట్లలో భారత్ నుంచి వచ్చే విమానాల్లో వారానికి 760 సీట్లను కేటాయిస్తున్నట్లు పౌర విమానయాన సంస్థ తెలిపింది. కేటాయించిన కోటాలో భారత విమానయాన సంస్థలకు 380, కువైట్ విమానయాన సంస్థలకు 380 సీట్లను అలాట్ చేసింది. కువైట్ కోటాలోని 380 సీట్లలో కువైట్ ఎయిర్ వేస్ కు 230 సీట్లు, జజీరా ఎయిర్ వేస్ కు 150 సీట్లు కేటాయించింది. ఇదిలాఉంటే భారత్ టూ కువైట్ డెరెక్ట్ ఫ్లైట్స్ షెడ్యూల్ వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఈద్ అల్ అదా ముందు టపాసుల వినియోగంపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- చాట్GPT చూసి బాంబుల తయారీ!
- మరోసారి విజయ్ ప్రభుత్వం పై స్టాలిన్ కౌంటర్
- క్వెట్టా రైల్వే స్టేషన్లో ఘోర ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి
- మస్కట్ విమానాశ్రయంలో భారీగా మారిజూన సీజ్..!!
- నైటింగేల్స్ ఆఫ్ బహ్రెయిన్ సర్వీస్ అవార్డ్ 2026 ప్రకటించిన ILA బహ్రెయిన్..!!
- ట్రంప్, అరబ్ లీడర్లతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ కీలక చర్చలు..!!
- ఈద్ అల్ అదా.. యూఏఈ హైపర్మార్కెట్లలో 50% తగ్గింపు ఆఫర్లు..!!
- అద్భుతమైన సంగీత ప్రదర్శనలతో ఫౌంటెన్ తిరిగి ప్రారంభం..!!
- అమెరికా వెళ్లే.. ఖతార్ ఫుట్బాల్ అభిమానుల కోసం గైడ్ లైన్స్ జారీ..!!









