అక్టోబర్ 3 నుంచి హైవేలపై డెలివరీ బైక్ ల నిషేధం
- August 31, 2021
కువైట్: అక్టోబర్ 3 నుంచి హైవేలపై డెలివరీ బైక్ లను నిషేధిస్తున్నట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. డెలివరీ కంపెనీల ఫెడరేషన్ మీటింగ్ లో ట్రాఫిక్& ఆపరేషన్స్ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ, మేజర్ జనరల్ జమాల్ అల్-సయీగ్, రోడ్లపై డెలివరీ బైక్లకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం హైవేలపై డెలివరీ బైక్ లను నిషేధిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ జనరల్ డిపార్ట్ మెంట్ వెల్లడించిన వివరాల మేరకు ఫస్ట్ రింగ్ రోడ్, ఫోర్త్ రింగ్ రోడ్, ఐదవ రింగ్ రోడ్, సిక్స్త్ రింగ్ రోడ్, ఏడవ రింగ్ రోడ్, కింగ్ అబ్దుల్ అజీజ్ రోడ్ 30, కింగ్ ఫహద్ బిన్ అబ్దులాజీజ్ రోడ్ 40, కింగ్ ఫైసల్ బిన్ అబ్దులాజీజ్ రోడ్ 50, అల్-గజాలీ రోడ్ 60, జహ్రా రోడ్, గమల్ అబ్దేల్ నాసర్ రోడ్ (ఎగువ వంతెన), జాబర్ వంతెన రహదారుల్లో అక్టోబర్ 3 నుంచి డెలివరీ బైక్ లను అనుమతించారు. అలాగే వాహనదారుల భద్రత కోసం డెలివరీ బైక్ వెనక ఏర్పాటు చేసే బాక్స్ పై రిఫ్లెక్టివ్ లైట్ స్ట్రిప్స్ని ఏర్పాటు చేయాలని సూచించారు. డెలివరీ మోటార్సైకిలిస్టులు హెల్మెట్ ధరించాలన్నారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







