స్మార్ట్ ఫోన్లను దుర్వినియోగం చేస్తే ఏడాది జైలు, SR5,00,000 ఫైన్
- August 31, 2021
సౌదీ: స్మార్ట్ ఫోన్లను దుర్వినియోగం చేయటం ద్వారా ఇతరుల ప్రైవసీకి భంగం కలిగించినా, వారి గౌరవానికి హాని కలిగించేలా వ్యవహరించినా ఏడాది జైలు శిక్ష, SR500,000 జరిమానా విధిస్తామని సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ల ద్వారా ఇతరుల గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరించిన కేసులో జరిమానాలను సమీక్షిస్తున్న సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇలా హెచ్చరించింది. పని ప్రదేశాలలో ఇతరుల గోప్యతకు భంగం కలిగేలా ఫోటోలు తీయటం, వారి గౌరవానికి నష్టం వాటిల్లేలా వ్యవహరించటం, నైతికతను ఉల్లంఘించడం వంటివి స్మార్ట్ ఫోన్ దుర్వినియోగం కిందకు వస్తాయి. నిందితుడు బాలనేరస్తుడైతే జువెనైల్ చట్టంలో నిర్దేశించిన జరిమానాల ప్రకారం అతడిని శిక్షించనున్నట్లు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









