స్మార్ట్ ఫోన్లను దుర్వినియోగం చేస్తే ఏడాది జైలు, SR5,00,000 ఫైన్
- August 31, 2021
సౌదీ: స్మార్ట్ ఫోన్లను దుర్వినియోగం చేయటం ద్వారా ఇతరుల ప్రైవసీకి భంగం కలిగించినా, వారి గౌరవానికి హాని కలిగించేలా వ్యవహరించినా ఏడాది జైలు శిక్ష, SR500,000 జరిమానా విధిస్తామని సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ల ద్వారా ఇతరుల గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరించిన కేసులో జరిమానాలను సమీక్షిస్తున్న సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇలా హెచ్చరించింది. పని ప్రదేశాలలో ఇతరుల గోప్యతకు భంగం కలిగేలా ఫోటోలు తీయటం, వారి గౌరవానికి నష్టం వాటిల్లేలా వ్యవహరించటం, నైతికతను ఉల్లంఘించడం వంటివి స్మార్ట్ ఫోన్ దుర్వినియోగం కిందకు వస్తాయి. నిందితుడు బాలనేరస్తుడైతే జువెనైల్ చట్టంలో నిర్దేశించిన జరిమానాల ప్రకారం అతడిని శిక్షించనున్నట్లు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







