స్మార్ట్ ఫోన్లను దుర్వినియోగం చేస్తే ఏడాది జైలు, SR5,00,000 ఫైన్

- August 31, 2021 , by Maagulf
స్మార్ట్ ఫోన్లను దుర్వినియోగం చేస్తే ఏడాది జైలు, SR5,00,000 ఫైన్

సౌదీ: స్మార్ట్ ఫోన్లను దుర్వినియోగం చేయటం ద్వారా ఇతరుల ప్రైవసీకి భంగం కలిగించినా, వారి గౌరవానికి హాని కలిగించేలా వ్యవహరించినా ఏడాది జైలు శిక్ష, SR500,000 జరిమానా విధిస్తామని సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ల ద్వారా ఇతరుల గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరించిన కేసులో జరిమానాలను సమీక్షిస్తున్న సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇలా హెచ్చరించింది. పని ప్రదేశాలలో ఇతరుల గోప్యతకు భంగం కలిగేలా ఫోటోలు తీయటం, వారి గౌరవానికి నష్టం వాటిల్లేలా వ్యవహరించటం, నైతికతను ఉల్లంఘించడం వంటివి స్మార్ట్ ఫోన్ దుర్వినియోగం కిందకు వస్తాయి. నిందితుడు బాలనేరస్తుడైతే జువెనైల్ చట్టంలో నిర్దేశించిన జరిమానాల ప్రకారం అతడిని శిక్షించనున్నట్లు స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com