తాలిబన్ ప్రతినిధులతో భేటీ అయిన ఇండియన్ అంబాసిడర్
- August 31, 2021
దోహా: దోహాలో తాలిబన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు ఇండియన్ అంబాసిడర్ దీపక్ మిట్టల్.ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్న భారతీయులకు ఎలాంటి హానీ తలపెట్టవద్దని కోరారు.అంతేకాదు ఆఫ్గన్ నుంచి భారతీయుల తరలింపును కూడా అడ్డుకోవద్దని సూచించారు.తాలిబన్లతో అధికార హోదాలో భారత్ చర్చలు జరపడం ఇదే తొలిసారి.
తాలిబన్ నాయకులతో ఇండియన్ అంబాసిడర్ దీపక్ మిట్టల్ మంగళవారం సమావేశం అయ్యారు.ఖతార్లోని తాలిబాన్ రాజకీయ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.ఈ మావేశంలో ఆ దేశ నాయకుడు షేర్ మహ్మద్ అబ్బాస్ను ఇండియన్ అంబాసిడర్ దీపక్ మిట్టల్ కలిశారు.
అయితే గత కొద్ది రోజులుగా తాలిబన్ నాయకులు భారత్ను కోరుతున్నారు.ఈ మేరకు దోహాలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్న భారతీయ పౌరుల భద్రతతోపాటు అక్కడే చిక్కుకున్నవారు తిరిగి రావడంపై చర్చలు జరిగాయి.
ఇదిలా వుంటే.. తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఎవరైనా సంతోషంగా ఉన్నారు అని చెప్పుకోవాల్సి వస్తే అది పాకిస్థాన్ మాత్రమే. తాలిబన్ ప్రభుత్వానికి ప్రపంచ దేశాల మద్దతు మూటగట్టడానికి.. ప్రత్యేకించి ఇస్లామిక్ దేశాలన్నిటినీ తాలిబన్లకు దగ్గర చేయడానికి చర్యలు ప్రారంభించింది పాకిస్తాన్. ఇందులో భాగంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి అనేక దేశాలకు ప్రత్యేకించి ఆఫ్ఘనిస్తాన్ పొరుగు దేశాలకు వెళ్లారు.
ఒక నివేదిక ప్రకారం, తాలిబాన్ ప్రభుత్వాన్ని ప్రపంచంలోని చాలా దేశాలు గుర్తించాలని, దీని ద్వారా ఇక్కడ తన ప్రభావాన్ని పెంచుకోవాలని పాకిస్తాన్ బలంగా కోరుకుంటోంది. మరోవైపు, భారతదేశంతో సహా చాలా దేశాలు ‘చూడండి..వేచి ఉండండి’ విధానాన్ని అనుసరిస్తున్నారనేది కూడా నిజం. ఆగస్టు 31 తర్వాత, చిత్రాన్ని దౌత్య స్థాయిలో క్లియర్ చేయడం ప్రారంభించవచ్చు.అప్పటికి విదేశీ సైనికులు.. పౌరులందరూ ఆఫ్ఘనిస్తాన్ నుండి బయటకు వెళ్ళిపోవడం పూర్తవుతుందని భావన.
తాజా వార్తలు
- భారత్ పై OpenAI సీఈవో సామ్ అల్ట్మన్ ప్రశంసలు
- డేటా సెంటర్లతో భారీ ఉపాధి: ప్రధాని మోదీ
- దోహాలో ఖతార్ రోబోటిక్స్ AI కాంపిటీషన్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ - దమ్మామ్ మధ్య హెలికాప్టర్ సర్వీస్..!!
- ‘సహ్ల్’ యాప్ లో సాలరీ డిడక్షన్ నోటిఫికేషన్..!!
- ఒమన్లో వరుస నేరాలు..పలువురు అరెస్టు..!!
- సౌదీ అరేబియాలో స్కూల్స్ టైమింగ్స్ ఛేంజ్..!!
- యూఏఈ 'రాయల్ ఫోటోగ్రాఫర్' రమేష్ శుక్లా కన్నుమూత..!!
- ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం జరగబోతుంది !!
- బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి









