ఇండియా టూ కువైట్ డైరెక్ట్ ఫ్లైట్స్..వారానికి 5528 కేటాయింపు
- September 02, 2021
కువైట్: ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్లకు సంబంధించి కువైట్ డీజీసీఏ కొత్తగా సీట్ల కోటాను పెంచింది. వారానికి 5528 సీట్లను పరిమితం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇదే అంశంపై భారత పౌర విమానయాన శాఖకు కువైట్ డీజీసీఏ లేఖ రాసింది. ఇండియా నుంచి వచ్చే డైరెక్ట్ ఫ్లైట్లలో ప్రయాణికుల సంఖ్య పరిమితిని మంత్రి మండలి నిర్ణయించిన తర్వాత కువైట్ డీజీసీఏ ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం కువైట్కు మొత్తం 5,528 సీట్లు కేటాయించగా..ఆదివారం 656, సోమవారం 1,112, మంగళవారం 648, బుధవారం 648, గురువారం 1,088, శుక్రవారం 638, శనివారం 738 సీట్లు కేటాయించినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఇదిలాఉంటే గతంలో ఇండియా నుంచి వచ్చే డైరెక్ట్ ఫ్లైట్లలో వారానికి 760 సీట్లను మాత్రమే కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు గతంలో కన్నా 8 రెట్లు పెంచటం విశేషం.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









