ఇండియా టూ కువైట్ డైరెక్ట్ ఫ్లైట్స్..వారానికి 5528 కేటాయింపు
- September 02, 2021
కువైట్: ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్లకు సంబంధించి కువైట్ డీజీసీఏ కొత్తగా సీట్ల కోటాను పెంచింది. వారానికి 5528 సీట్లను పరిమితం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇదే అంశంపై భారత పౌర విమానయాన శాఖకు కువైట్ డీజీసీఏ లేఖ రాసింది. ఇండియా నుంచి వచ్చే డైరెక్ట్ ఫ్లైట్లలో ప్రయాణికుల సంఖ్య పరిమితిని మంత్రి మండలి నిర్ణయించిన తర్వాత కువైట్ డీజీసీఏ ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం కువైట్కు మొత్తం 5,528 సీట్లు కేటాయించగా..ఆదివారం 656, సోమవారం 1,112, మంగళవారం 648, బుధవారం 648, గురువారం 1,088, శుక్రవారం 638, శనివారం 738 సీట్లు కేటాయించినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఇదిలాఉంటే గతంలో ఇండియా నుంచి వచ్చే డైరెక్ట్ ఫ్లైట్లలో వారానికి 760 సీట్లను మాత్రమే కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు గతంలో కన్నా 8 రెట్లు పెంచటం విశేషం.
తాజా వార్తలు
- 76ఏళ్ల వయస్సులో భార్యను హత్యచేసి.. మృతదేహం వద్ద కూర్చొని పక్కింట్లోకి ఫోన్..
- మే నెలలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావం
- ఈనెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..
- వీసా ఇమ్మిగ్రేషన్ రూల్స్లో భారీ మార్పులు
- ఏప్రిల్ నుండి ఫేస్బుక్ మెసెంజర్ క్లోజ్..!!
- గాజా శాంతి, పునర్నిర్మాణ ప్రయత్నాలకు మద్దతు ..!!
- హోం బేస్డ్ గ్రోసరీ స్టోర్లు మూసివేత..!!
- రద్దీ నివారణకు ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..!!
- మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22% వృద్ధి..!!
- ఈద్ సెలవులు 3 లేదా 4 రోజులు ఉంటాయా?









