భారత్‌ కరోనా అప్‌డేట్..

- September 02, 2021 , by Maagulf
భారత్‌ కరోనా అప్‌డేట్..

న్యూ ఢిల్లీ: భారత్‌లో తగ్గినట్టే తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. ఇప్పుడు మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.రోజువారి కేసుల సంఖ్య ఇప్పుడు 50 వేల వైపు పరుగులు తీస్తోంది.. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 47,092 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.మరో 509 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 35,181 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో ఇప్పటి వరకు దేశ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,28,57,937కు చేరుకోగా.. రికవరీ కేసులు 3,20,28,825కి పెరిగాయి.. ఇక, కోవిడ్‌ బారినపడి ఇప్పటి వరకు 4,39,529 మంది మృతిచెందగా.. ప్రస్తుతం దేశంలో 3,89,583 మంది యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. గత 24 గంటల్లో 81,09,244 డోసుల వ్యాక్సిన్‌ వేయగా.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 66,30,37,334 వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com