ఇండియా టూ కువైట్ డైరెక్ట్ ఫ్లైట్స్..వారానికి 5528 కేటాయింపు
- September 02, 2021
కువైట్: ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్లకు సంబంధించి కువైట్ డీజీసీఏ కొత్తగా సీట్ల కోటాను పెంచింది. వారానికి 5528 సీట్లను పరిమితం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇదే అంశంపై భారత పౌర విమానయాన శాఖకు కువైట్ డీజీసీఏ లేఖ రాసింది. ఇండియా నుంచి వచ్చే డైరెక్ట్ ఫ్లైట్లలో ప్రయాణికుల సంఖ్య పరిమితిని మంత్రి మండలి నిర్ణయించిన తర్వాత కువైట్ డీజీసీఏ ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం కువైట్కు మొత్తం 5,528 సీట్లు కేటాయించగా..ఆదివారం 656, సోమవారం 1,112, మంగళవారం 648, బుధవారం 648, గురువారం 1,088, శుక్రవారం 638, శనివారం 738 సీట్లు కేటాయించినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఇదిలాఉంటే గతంలో ఇండియా నుంచి వచ్చే డైరెక్ట్ ఫ్లైట్లలో వారానికి 760 సీట్లను మాత్రమే కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు గతంలో కన్నా 8 రెట్లు పెంచటం విశేషం.
తాజా వార్తలు
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!
- స్కూళ్లలో డిస్టెన్స్ లెర్నింగ్..సిద్ధమవుతున్నారా?
- భారత్లో టీసీఎస్తో జత కట్టిన OpenAI
- 76ఏళ్ల వయస్సులో భార్యను హత్యచేసి.. మృతదేహం వద్ద కూర్చొని పక్కింట్లోకి ఫోన్..
- మే నెలలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావం
- ఈనెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..









