ప్రమోద్ భగత్ కి పారాలింపిక్స్లో గోల్డ్మెడల్.. భారత్కి 17వ పతకం
- September 04, 2021
టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో భారత్కి నాలుగో గోల్డ్ మెడల్ దక్కింది. ఫురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ SL3 ఫైనల్లో శనివారం పోటీపడిన ప్రమోద్ భగత్ అద్భుత విజయంతో పసిడి పతకాన్ని గెలుపొందాడు. టోక్యో పారాలింపిక్స్ బ్యాడ్మింటన్లో భారత్కి ఇదే తొలి బంగారు పతకంకాగా.. మొత్తంగా భారత్ పతకాల సంఖ్య 17కి చేరింది.
ఈరోజు ఫైనల్లో గ్రేట్ బ్రిటన్కి చెందిన డేనియల్ బేతెల్తో తలపడిన ప్రమోద్ భగత్.. 21-14, 21-17 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. తొలి సెట్లో ఆరంభం నుంచి ఆధిక్యంలో కొనసాగించిన ప్రమోద్ భగత్.. డేనియల్కి పుంజుకునే అవకాశమే ఇవ్వలేదు. కానీ.. సెకండ్ సెట్లో మాత్రం ఒకానొక దశలో 4-11తో ప్రమోద్ ఒత్తిడిలో కనిపించాడు. కానీ.. బ్రేక్ తర్వాత పుంజుకుని ప్రత్యర్థి నాలుగు పాయింట్లు సాధించలేలోపే ఏకంగా 13 పాయింట్లు సాధించి 17-15తో ఆధిక్యంలో వెళ్లాడు. ఆ తర్వాత సెట్ని ముగించడానికి కూడా ప్రమోద్ ఎక్కువ సమయం తీసుకోలేదు. అలానే ఫురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ SL3 కాంస్య పతక పోరులో భారత్కి చెందిన మనోజ్ సర్కార్ 22-20, 21-13 తేడాతో జపాన్ షట్లర్ పుజిహరాని ఓడించాడు.
పారాలింపిక్స్ పతకాల పట్టికలో 35వ స్థానంలో ఉన్న భారత్ జట్టు ఈ రెండు మెడల్స్ (బంగారం, కాంస్యం)తో 25వ స్థానానికి ఎగబాకింది. భారత్ ఖాతాలో ప్రస్తుతం మొత్తం 17 పతకాలు ఉండగా.. ఇందులో నాలుగు పసిడి, ఏడు రజతం, ఆరు కాంస్యం ఉన్నాయి.
తాజా వార్తలు
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- ఉత్తర అల్ బతీనాహ్లో అంబులెన్స్ ప్రమాదం
- IPL 2026: సన్రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
- అనుమతి లేని ఎయిర్లైన్స్తో టికెట్లు బుక్ చేయవద్దు: కువైట్ DGCA హెచ్చరిక
- ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక అడుగు
- రష్యా వీసా ఖర్చుల భారం లేకుండా ట్రిప్ ప్లాన్
- యూఏఈలో రేపటి వాతావరణం ప్రశాంతం
- ఆన్లైన్ క్లాసులు నిర్వహించండి..స్కూళ్లకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి
- భారత దేశవ్యాప్తంగా NEET పరీక్ష రద్దు..కేంద్రం సంచలన నిర్ణయం
- తమిళనాడులో సీఎం విజయ్ షణ్ముగంతో కీలక భేటీ









