కువైట్ విమానాశ్రయంలో కార్యకలాపాల పెంపు
- September 05, 2021
కువైట్: కరోనా పాండమిక్ నుంచి ప్రపంచం కోలుకుంటున్న నేపథ్యంలో డైరెక్ట్ విమానాల సంఖ్య పెరుగుతోంది.. కుైవట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యాక్టివిటీస్ రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈజిప్టు నుంచి విమానాలు ఆదివారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 137 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిల్లో 68 కువైట్ నుంచి వెళుతుండగా, కువైట్ వచ్చేవి 69 విమానాలు. స్పెషల్ విమానాలు, కార్గో విమానాలు అదనం. కైరో నుంచి 12 విమానాలు, ఈజిప్ట్ ఎయిర్ నుంచి 5 విమానాలు, జజీరా ఎయిర్వేస్ మరియు ఫ్లై ఈజిప్ట్ నుంచి విమానాల్ని ఆపరేట్ చేస్తున్నారు. దుబాయ్, బీరుట్, కైరో, దోహా, ఇస్తాంబుల్, సార్జా, బహ్రెయిన్, కొలంబో, అబుదాబీ, మనీలా, లండన్, బిష్కెక్ తదితర ప్రాంతాల నుంచి విమానాలు నడుస్తున్నాయి. అయితే, ఇండి నుంచి విమానాల విషయమై ఇంకా స్పష్టత రావాల్సి వుంది. ఈ వారంతంలో సానకూల ప్రకటన రావొచ్చు.
తాజా వార్తలు
- చంద్రబాబు ఇంటి పై పేర్ని నాని సంచలన ఆరోపణలు
- వెస్ట్ బెంగాల్: జూన్ 1 నుంచి ఉచిత బస్సు ప్రయాణం
- IPL 2026: పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
- ఐదు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ
- సింగపూర్లో మంత్రి లోకేష్..
- హనుమ జయంతి శుభాకాంక్షలు తెలిపిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి
- మలేషియాలో ఘనంగా 'ఎన్టీఆర్ సజీవ చరిత్ర' పుస్తకావిష్కరణ
- రూపాయి పతనం..95.31కి పడిపోయిన భారత కరెన్సీ
- మచిలీపట్నం అభివృద్ధి అంశాల పై కేంద్ర కార్యదర్శితో ఎంపీ బాలశౌరి సమావేశం
- మాజీ IPS భార్య హత్య కేసులో కీలక పరిణామం..









