చంద్రబాబు ఇంటి పై పేర్ని నాని సంచలన ఆరోపణలు
- May 11, 2026
మచిలీపట్నం: అమరావతి రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నిర్మించుకుంటున్న ఇంటి వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై వైసీపీ నేత పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో చంద్రబాబు నిర్మించుకుంటున్న ఇంటి సమీపంలోని భూములను గ్రీన్ బెల్ట్గా ప్రకటించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న భూ కేటాయింపులు, నిర్మాణాలపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఇంటి సమీపంలో సుమారు 3800 గజాల భూమిని గ్రీన్ బెల్ట్గా ప్రకటించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని పేర్ని నాని ప్రశ్నించారు. గతంలో రెసిడెన్షియల్ జోన్గా ఉన్న ప్రాంతం ఒక్కసారిగా గ్రీన్ బెల్ట్గా ఎలా మారిందని నిలదీశారు. చంద్రబాబు ఇంటి పక్కన ఇతరులు నివసించకుండా చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారా అని విమర్శించారు.
అమరావతి పై తీవ్ర ఆరోపణలు
సాధారణ రైతులకు లభించని ప్రాధాన్యత చంద్రబాబు బినామీలకు మాత్రం లభిస్తోందని పేర్ని నాని ఆరోపించారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి కీలక ప్రభుత్వ భవనాల మధ్యలో చంద్రబాబుకు ప్లాటు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. ఈ నిర్మాణాన్ని ఏ రకమైన ‘ప్యాలెస్’గా పిలవాలో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో కొందరికి మాత్రమే లాభాలు చేకూరుతున్నాయని, రైతులకు న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- IBPC Dubai to Mark India’s 80th Independence Day with Celebration of India-UAE Friendship, Innovation and a Shared Future
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!







