నీటి కాలుష్యం: 20 మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరీమానా

- September 05, 2021 , by Maagulf
నీటి కాలుష్యం: 20 మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరీమానా

సౌదీ అరేబియా: సౌదీ జలాల కాలుష్యానికి కారకులయ్యే వ్యక్తులు లేదా సంస్థలకు 20 మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరీమానా విధించే అవకాశం వుంది. ప్రమాదకర వస్తువుల్ని సౌదీ జలాల్లో పారవేయడం వంటివి కాలుష్యానికి కారకాలుగా పరిగణిస్తారు. బీచ్‌లను పాడు చేయడం, తవ్వకాలు, తవ్విన వాటిని నింపెయ్యడం.. వంటివాటిని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటారు. మెరైన్ స్పోర్ట్స్ యాక్టివిటీస్‌కి ప్రత్యేకంగా అనుమతులు మంజూరు చేస్తారు. ఎక్కువగా ఎకో ఫ్రెండ్లీ విధానాలకే అనుమతిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com