40 టన్నుల గడువు తీరిన ఆహార పదార్థాల సీజ్

- September 06, 2021 , by Maagulf
40 టన్నుల గడువు తీరిన ఆహార పదార్థాల సీజ్

యూఏఈ: 40 టన్నుల గడువు తీరిన ఆహార పదార్ధాల్ని అజ్మన్ ఇండస్ర్టియల్ ఏరియాలోని ఓ వేర్ హౌస్ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ అజ్మన్, అలాగే, ఎమిరేట్ మునిసిపాలిటీ పోలీస్ విభాగం సంయుక్తంగా సోదాలు నిర్వహించి, ఇల్లీగల్ యాక్టివిటీస్‌పై ఉక్కుపాదం మోపారు. పాత స్టిక్కర్లను తొలిగించి, కొత్త స్టిక్కర్లను అతికించడం ద్వారా అక్రమార్కులు గడువు తీరిన ఆహార పదార్ధాలతో ప్రజారోగ్యానికి హాని చేస్తున్నారు. వేర్ హౌస్ మూసి వేస్తూ, అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పలు వాహనాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com