యెమెన్‌ వైమానిక దాడుల్లో 41 మంది మృతి

- March 15, 2016 , by Maagulf
యెమెన్‌ వైమానిక దాడుల్లో 41 మంది మృతి

యెమెన్‌లోని ఉత్తరాది పట్టణమైన ముస్తబాపై సౌదీ నేతృత్వంలోని సంకీర్ణదళాలు మంగళవారం జరిపిన వైమానిక దాడుల్లో 41 మంది పౌరులు మరణించారని వైద్య, గిరిజన వర్గాలు తెలిపాయి. హజ్జా ప్రావిన్స్‌లో ఈ దాడి జరిగింది. 41 మృతదేహాలు దవాఖానాకు వచ్చాయని డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థకు చెందిన ఓ వైద్యుడు తెలిపారు. మృతులంతా పౌరులేనని, వారిలో పిల్లలు కూడా ఉన్నారని ఆయన వివరంచారు. దాడుల్లో గాయపడిన 35 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని వైద్యులు చెప్పారు. ముస్తబాలోని మార్కెట్‌పై సంకీర్ణ దళాలు అనేకసార్లు బాంబులు కురిపించాయని స్థానిక అధికారులు, గిరిజన తెగల నాయకులు తెలిపారు.యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా ఇలాన్ మద్దతుతో సాయుధముఠాలు పోరాడుతున్నాయి. వారిపై సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం దాడులు జరుపుతున్నది. యెమెన్ అంతర్యుద్ధానికి ఇప్పటివరకు 6,200 మంది బలయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com