యెమెన్ వైమానిక దాడుల్లో 41 మంది మృతి
- March 15, 2016
యెమెన్లోని ఉత్తరాది పట్టణమైన ముస్తబాపై సౌదీ నేతృత్వంలోని సంకీర్ణదళాలు మంగళవారం జరిపిన వైమానిక దాడుల్లో 41 మంది పౌరులు మరణించారని వైద్య, గిరిజన వర్గాలు తెలిపాయి. హజ్జా ప్రావిన్స్లో ఈ దాడి జరిగింది. 41 మృతదేహాలు దవాఖానాకు వచ్చాయని డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థకు చెందిన ఓ వైద్యుడు తెలిపారు. మృతులంతా పౌరులేనని, వారిలో పిల్లలు కూడా ఉన్నారని ఆయన వివరంచారు. దాడుల్లో గాయపడిన 35 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని వైద్యులు చెప్పారు. ముస్తబాలోని మార్కెట్పై సంకీర్ణ దళాలు అనేకసార్లు బాంబులు కురిపించాయని స్థానిక అధికారులు, గిరిజన తెగల నాయకులు తెలిపారు.యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా ఇలాన్ మద్దతుతో సాయుధముఠాలు పోరాడుతున్నాయి. వారిపై సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం దాడులు జరుపుతున్నది. యెమెన్ అంతర్యుద్ధానికి ఇప్పటివరకు 6,200 మంది బలయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







