ఛారిటీ వర్క్ కోసం ఎహ్సాన్ కు SR10M విరాళం ఇచ్చిన యువరాజు
- September 12, 2021
రియాద్: సౌదీ యువరాజు, రక్షణ మంత్రి ముహమ్మద్ బిన్ సల్మాన్ తన ధాత్రృత్వాన్ని చాటుకున్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కోసం "ఎహ్సాన్" జాతీయ వేదికకు ధార్మిక, లాభాపేక్షలేని పనుల నిర్వహణకు SR 10 మిలియన్లను విరాళంగా ఇచ్చారు. "ఎహ్సాన్" జాతీయ వేదిక ఇటీవల సౌదీ డేటా మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA) ద్వారా విరాళాల నిర్వహణ కోసం ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పోర్టల్గా ప్రారంభించిన విషయం తెలిసిందే. క్రౌన్ ప్రిన్స్ విరాళంతో, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం ఎహ్సాన్ ప్లాట్ఫామ్ ద్వారా సేకరించిన విరాళం SR1 బిలియన్లకు చేరుకుందని, SDAIA ప్రెసిడెంట్ అబ్దుల్లా బిన్ షరాఫ్ అల్-గమ్ది తెలిపారు. ఎహ్సాన్ జాతీయ వేదిక ధార్మిక కార్యక్రమాల కోసం క్రౌన్ ప్రిన్స్ అందించిన ఉదార విరాళాన్ని ఎంతో విలువైనదిగా ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







