ఇరాక్: విమానాశ్రయంపై డ్రోన్లతో దాడి
- September 12, 2021బాగ్దాద్: ఇరాక్ లో మరోసారి బాంబుల మోత మోగింది. ఎర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయంపై రెండు డ్రోన్లతో దాడి జరిగింది. ఈ దాడి జరిగిన ప్రాంతంలో ప్రజలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.అయితే ఈ దాడికి పాల్పడిన వారు ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ విమానాశ్రయం సమీపంలో అమెరికన్ కాన్సులేట్ కూడా ఉంది. పేలుళ్ల అనంతరం దట్టమైన పొగ కమ్ముకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతాదళాలు విమానాశ్రయ గేట్లను మూసివేశాయి.శనివారం రాత్రి ఎర్బిల్ విమానాశ్రయం సమీపంలో రెండు సార్లు భారీ శబ్ధాలు వినిపించాయని, చుట్టు పక్కల ప్రాంతాలు మొత్తం నల్లని పొగలు కమ్ముకున్నాయని స్థానికులు వెల్లడించారు. కాగా, విమానాశ్రయం కేంద్రంగా జిహాద్ వ్యతిరేక దళాలు కూడా పనిచేస్తున్నాయని తెలిపారు. ఇటీవల కాలంలో ఇరాక్లో విమానాశ్రయాలపై దాడులు సర్వసాధారణమయ్యాయి.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..