24 గంటల్లో కోవిడ్ 19 మరణాలు ‘సున్నా’

- September 13, 2021 , by Maagulf
24 గంటల్లో కోవిడ్ 19 మరణాలు ‘సున్నా’

మస్కట్: కొత్తగా దేశంలో గడచిన ఇరవై నాలుగ్గంటల్లో 58 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, ఒక్కరూ గడచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోలేదు. కాగా, దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కోవిడ్ 19 కేసుల సంఖ్య 303,163గా వుంది. మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 4,089 అని మినిస్ట్రీ వెల్లడించింది. గడచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి 89 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా కోలుకున్నవారి సంఖ్య 293,343గా వుంది. గడచిన 24 గంటల్లో 14 మంది ఆసుపత్రుల్లో చేరారు కరోనా కారణంగా. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 66 కాగా, అందులో 28 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతున్నారు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com