డైరెక్ట్ విమానాల ప్రారంభంతో వారంలోనే 17,843 మంది ప్రయాణీకులు కువైట్కి రాక
- September 13, 2021
కువైట్: ఈజిప్ట్ మరియు ఇండియా నుంచి కువైట్కి డైరెక్ట్ విమానాల్ని అనుమతించిన వారం రోజుల్లోనే పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు కువైట్ చేరుకున్నారు. మొత్తం 174 విమానాలు ఈజిప్టు అలాగే ఇండియా నుంచి కువైట్ వచ్చాయి. వీటిల్లో 89 విమానాలు ఈజిప్టు నుంచి రాగా, 85 ఇండియా నుంచి వచ్చాయి. ఈ విమానాల్లో కువైట్ చేరుకున్న మొత్తం ప్రకాణీకుల సంఖ్య 17,843గా వుంది. ఈజిప్టు నుంచి 10,261 మంది, ఇండియా నుంచి 7,582 మంది కువైట్ చేరుకున్నారు. ఆయా దేశాల నుంచి ప్రయాణాల పై బ్యాన్ ఎత్తివేసిన తర్వాత క్రమంగా ఎయిర్ పోర్టు సామర్థ్యాన్ని పెంచుతూ వస్తున్నారు. అయితే, కట్టుదిట్టమైన రీతిలో కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రయాణీకులంతా పాటించేలా అథారిటీస్ చర్యలు తీసుకోవడం జరుగుతోంది.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









