డైరెక్ట్ విమానాల ప్రారంభంతో వారంలోనే 17,843 మంది ప్రయాణీకులు కువైట్కి రాక
- September 13, 2021
కువైట్: ఈజిప్ట్ మరియు ఇండియా నుంచి కువైట్కి డైరెక్ట్ విమానాల్ని అనుమతించిన వారం రోజుల్లోనే పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు కువైట్ చేరుకున్నారు. మొత్తం 174 విమానాలు ఈజిప్టు అలాగే ఇండియా నుంచి కువైట్ వచ్చాయి. వీటిల్లో 89 విమానాలు ఈజిప్టు నుంచి రాగా, 85 ఇండియా నుంచి వచ్చాయి. ఈ విమానాల్లో కువైట్ చేరుకున్న మొత్తం ప్రకాణీకుల సంఖ్య 17,843గా వుంది. ఈజిప్టు నుంచి 10,261 మంది, ఇండియా నుంచి 7,582 మంది కువైట్ చేరుకున్నారు. ఆయా దేశాల నుంచి ప్రయాణాల పై బ్యాన్ ఎత్తివేసిన తర్వాత క్రమంగా ఎయిర్ పోర్టు సామర్థ్యాన్ని పెంచుతూ వస్తున్నారు. అయితే, కట్టుదిట్టమైన రీతిలో కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రయాణీకులంతా పాటించేలా అథారిటీస్ చర్యలు తీసుకోవడం జరుగుతోంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







