డైరెక్ట్ విమానాల ప్రారంభంతో వారంలోనే 17,843 మంది ప్రయాణీకులు కువైట్కి రాక
- September 13, 2021
కువైట్: ఈజిప్ట్ మరియు ఇండియా నుంచి కువైట్కి డైరెక్ట్ విమానాల్ని అనుమతించిన వారం రోజుల్లోనే పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు కువైట్ చేరుకున్నారు. మొత్తం 174 విమానాలు ఈజిప్టు అలాగే ఇండియా నుంచి కువైట్ వచ్చాయి. వీటిల్లో 89 విమానాలు ఈజిప్టు నుంచి రాగా, 85 ఇండియా నుంచి వచ్చాయి. ఈ విమానాల్లో కువైట్ చేరుకున్న మొత్తం ప్రకాణీకుల సంఖ్య 17,843గా వుంది. ఈజిప్టు నుంచి 10,261 మంది, ఇండియా నుంచి 7,582 మంది కువైట్ చేరుకున్నారు. ఆయా దేశాల నుంచి ప్రయాణాల పై బ్యాన్ ఎత్తివేసిన తర్వాత క్రమంగా ఎయిర్ పోర్టు సామర్థ్యాన్ని పెంచుతూ వస్తున్నారు. అయితే, కట్టుదిట్టమైన రీతిలో కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రయాణీకులంతా పాటించేలా అథారిటీస్ చర్యలు తీసుకోవడం జరుగుతోంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







