ఇండియా ఏవియేషన్‌ సదస్సు, ప్రదర్శనను రాష్ట్రపతి ప్రారంభించారు..

- March 16, 2016 , by Maagulf
ఇండియా ఏవియేషన్‌ సదస్సు, ప్రదర్శనను రాష్ట్రపతి ప్రారంభించారు..

ఐదో అంతర్జాతీయ వైమానిక సదస్సు హైదరాబాద్‌లో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. బేగంపేట విమానాశ్రయంలో ఇండియా ఏవియేషన్‌ పేరిట ఏర్పాటుచేసిన సదస్సు, ప్రదర్శనను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తదితరులు పాల్గొన్నారు. దేశాన్ని వైమానిక విశ్వ కేంద్రంగా రూపొందించే లక్ష్యంతో కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రతి రెండేళ్లకోసారి అంతర్జాతీయ ప్రదర్శన, సదస్సు నిర్వహిస్తోంది. ఇందుకు హైదరాబాదే వేదికగా మారింది. అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనకు 25దేశాల మంత్రులు, రాయబారులు, ఉన్నతాధికారులతో పాటు వైమానిక రంగంలో పేరొందిన 12 దేశాలకు చెందిన 200 కంపెనీల వాణిజ్య ప్రతినిధులు ఈ ప్రదర్శనలో పాల్గొంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com