133 కిండర్గార్డెన్స్లో 18,500 మందికి పైగా విద్యార్థులు
- March 16, 2016
బహ్రెయిన్లో మొత్తం 133 కిండర్గార్టెన్స్ ఉన్నట్లు ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ మాజిద్ అల్ నౌమి చెప్పారు. ఈ కిండర్ గార్టెన్స్లో 18,500 మందికి పైగా విద్యార్థులున్నారని ఆయన వివరించారు. 2016లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందన్నారాయన. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ వీక్లీ మీటింగ్లో ఈ వివరాల్ని ప్రకటించారు మినిస్టర్. బహ్రెయిన్లో నాణ్యమైన విద్య విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదనీ, కిండర్గార్టెన్స్ విషయంలోనూ తగు జాత్త్రలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. గత ఏడాది కిండర్గార్టెన్స్లో సుమారు 194 సార్లు ఇన్స్పెక్షన్స్ జరిగాయనీ, కిండర్గార్టెన్స్లో అందుతున్న విద్య, నాణ్యతా ప్రమాణాలు, భద్రత, సౌకర్యాల విషయంలో ఈ ఇన్స్పెక్షన్స్ నిర్వహించడం జరిగిందని చెప్పారాయన. ఈ సందర్భంగా ఎంపీ అలీ బుపార్సన్ మాట్లాడుతూ కిండర్గార్టెన్స్ నుంచే ఖురానిక్ టీచింగ్ను మరింత విస్తృతం చేయవలసి ఉందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







