పాప్ అప్ స్టాండ్ వద్ద 50 శాతం రాయితీతో ఎయిర్ టిక్కెట్లను ప్రకటించిన ఎతిహాద్ ఎయిర్ వేస్
- September 17, 2021
దుబాయ్: దుబాయ్ మాల్ ఆఫ్ ఎమిరేట్స్ వద్ద పాప్ అప్ స్టాండ్లో ఎయిర్ టిక్కెట్స్ కొనుగోలు చేసేవారికి 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఎతిహాద్ ఎయిర్వేస్ వెల్లడించింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 16 నుంచి 23 వరకు అమల్లో వుంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో వుంటుంది. వారాంతాల్లో మిడ్ నైట్ వరకు ఈ స్టాండ్ తెరచి వుంటుంది. ఎతిహాద్ ఎయిర్ వేస్ బ్రాండ మార్కెటింగ్ మరియు స్పాన్సర్ షిప్ వైస్ ప్రెసిడెంట్ అమీనా తాహెచ్ మాట్లాడుతూ, అబుధాబిలో తప్పనిసరి క్వారంటైన్ నిబంధన ఎత్తివేయడంతో, ప్రయాణీకుల్ని ఆకర్షించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఫ్యూచర్ బుకింగ్స్ మీద ప్రత్యేకంగా 25 శాతం డిస్కౌంట్ పొందవచ్చునని ఎతిహాద్ వెల్లడించింది. డిసెంబర్ 8వ తేదీ వరకు ప్రయాణించేందుకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఎకానమనీ, బిజినెస్ క్లాసులకు అలాగే ఫస్ట్ క్లాస్ ప్రయాణానికి ఈ డిస్కౌంట్ వర్తించనుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







