పాప్ అప్ స్టాండ్ వద్ద 50 శాతం రాయితీతో ఎయిర్ టిక్కెట్లను ప్రకటించిన ఎతిహాద్ ఎయిర్ వేస్
- September 17, 2021
దుబాయ్: దుబాయ్ మాల్ ఆఫ్ ఎమిరేట్స్ వద్ద పాప్ అప్ స్టాండ్లో ఎయిర్ టిక్కెట్స్ కొనుగోలు చేసేవారికి 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఎతిహాద్ ఎయిర్వేస్ వెల్లడించింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 16 నుంచి 23 వరకు అమల్లో వుంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో వుంటుంది. వారాంతాల్లో మిడ్ నైట్ వరకు ఈ స్టాండ్ తెరచి వుంటుంది. ఎతిహాద్ ఎయిర్ వేస్ బ్రాండ మార్కెటింగ్ మరియు స్పాన్సర్ షిప్ వైస్ ప్రెసిడెంట్ అమీనా తాహెచ్ మాట్లాడుతూ, అబుధాబిలో తప్పనిసరి క్వారంటైన్ నిబంధన ఎత్తివేయడంతో, ప్రయాణీకుల్ని ఆకర్షించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఫ్యూచర్ బుకింగ్స్ మీద ప్రత్యేకంగా 25 శాతం డిస్కౌంట్ పొందవచ్చునని ఎతిహాద్ వెల్లడించింది. డిసెంబర్ 8వ తేదీ వరకు ప్రయాణించేందుకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఎకానమనీ, బిజినెస్ క్లాసులకు అలాగే ఫస్ట్ క్లాస్ ప్రయాణానికి ఈ డిస్కౌంట్ వర్తించనుంది.
తాజా వార్తలు
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!







