పాప్ అప్ స్టాండ్ వద్ద 50 శాతం రాయితీతో ఎయిర్ టిక్కెట్లను ప్రకటించిన ఎతిహాద్ ఎయిర్ వేస్
- September 17, 2021దుబాయ్: దుబాయ్ మాల్ ఆఫ్ ఎమిరేట్స్ వద్ద పాప్ అప్ స్టాండ్లో ఎయిర్ టిక్కెట్స్ కొనుగోలు చేసేవారికి 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఎతిహాద్ ఎయిర్వేస్ వెల్లడించింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 16 నుంచి 23 వరకు అమల్లో వుంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో వుంటుంది. వారాంతాల్లో మిడ్ నైట్ వరకు ఈ స్టాండ్ తెరచి వుంటుంది. ఎతిహాద్ ఎయిర్ వేస్ బ్రాండ మార్కెటింగ్ మరియు స్పాన్సర్ షిప్ వైస్ ప్రెసిడెంట్ అమీనా తాహెచ్ మాట్లాడుతూ, అబుధాబిలో తప్పనిసరి క్వారంటైన్ నిబంధన ఎత్తివేయడంతో, ప్రయాణీకుల్ని ఆకర్షించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఫ్యూచర్ బుకింగ్స్ మీద ప్రత్యేకంగా 25 శాతం డిస్కౌంట్ పొందవచ్చునని ఎతిహాద్ వెల్లడించింది. డిసెంబర్ 8వ తేదీ వరకు ప్రయాణించేందుకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఎకానమనీ, బిజినెస్ క్లాసులకు అలాగే ఫస్ట్ క్లాస్ ప్రయాణానికి ఈ డిస్కౌంట్ వర్తించనుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!