మెడికవర్ ఉమెన్ & చైల్డ్ హాస్పిటల్స్ లో ఘనంగా రోగి భద్రతా వారోత్సవాలు

- September 17, 2021 , by Maagulf
మెడికవర్ ఉమెన్ & చైల్డ్ హాస్పిటల్స్  లో  ఘనంగా రోగి భద్రతా వారోత్సవాలు

హైదరాబాద్: వరల్డ్ పేషేంట్ సేఫ్టీ డే సందర్బంగా రోగి భద్రతకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేసిన సిబ్బంది.సురక్షితమైన మరియు గౌరవప్రదమైన ప్రసవం కోసం ఇప్పుడే చర్య తీసుకోవాలని సూచించడమే  ఈ వారోత్సవాల ముఖ్య ఉదేశ్యం. 

ఈ సందర్భంగా మెడికవర్ ఉమెన్ &చైల్డ్ హాస్పిటల్స్ వారు గర్భిణీ స్త్రీలను , బాలింతలను , నవజాత శిశువులను ఉధ్యేశించి ఒక బుక్ లెట్ (సావనీర్ ) ని  నీరజ్ లాల్ - వైస్ ప్రెసిడెంట్ మెడికవర్ హాస్పిటల్స్ మరియు బేబీ నైనికా  వారిచే  విడుదల చేసారు. గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు , నవజాత శిశువు ని ఎలా సంరక్షించుకోవాలి ? ,  అను తదితర అంశాలను ఈ బుక్లెట్ లో పొందుపరిచారు. ఈ బుక్లెట్ ని మెడికవర్ హాస్పిటల్స్ వెబ్సైటు నందు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ సందర్భంగా డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగే ,HOD - నియోనాటాలజీ & పీడియాట్రిక్స్ గారు మాట్లాడుతూ  దాదాపుగా ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా 810 గర్భిణీలు , 6700 నవజాత శిశువులు అనేక కారణాల వల్ల మరణిస్తున్నారు. కోవిడ్  కారణంగా సరైన ఆసుపత్రులు, వైద్యసేవలు సరిగా లభించకపోవడంతో గర్భిణీలు అవస్థలు పడుతున్నారు.ప్రసవ సమయంలో మరణిస్తున్నారు .  ఇటువంటి అవరోధాలను నిర్మూలించడానికి కొత్త తరహా వ్యూహాలు , టెక్నాలజీ కోసం పాటుపడాలని WHO వారు స్వచ్చంద సంస్థలను మరియు స్త్రీ ,శిశు వైద్య విధాన సంస్థలను కోరుతున్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ నీరజ్ లాల్,డాక్టర్ రాకేష్ చీఫ్ మెడికల్ సర్వీసెస్ , డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగే ,HOD - నియోనాటాలజీ & పీడియాట్రిక్స్,డాక్టర్ అశ్విని అన్నం -  గైనకాలోజిస్ట్, డాక్టర్ వింధ్య - గైనకాలోజిస్ట్ , డాక్టర్ నవిత- పీడియాట్రిషన్  & నియనాటోలోజిస్ట్, సెంటర్ హెడ్ అనిల్ , ఆపరేషన్స్ హెడ్ సంగీత పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com