రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డూవేలం…
- September 19, 2021
హైదరాబాద్: బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయి ధరకు అమ్మకం జరిగింది. బాలాపూర్ లడ్డూ ను ఈ సారి కడప జిల్లా కు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మరియు మర్రి శశాంక్ రెడ్డి సొంతం చేసుకున్నారు.
ఏకంగా రూ. 18.90 లక్షల ధర పలికింది బాలాపూర్ లడ్డూ. ఇక బాలాపూర్ లడ్డు గెలుచుకున్న అనంతరం.. రమేష్ యాదవ్ మీడియా తో మాట్లాడారు. బాలాపూర్ లడ్డు ను గెలుచు కోవడం తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇవాళ గెలుచుకున్న బాలాపూర్ లడ్డు ను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తానని స్పష్టం చేశారు రమేష్ యాదవ్. 2019 వేలం కంటే లక్షా 30 వేల రూపాయలు ఈ సారి ఎక్కువ ధర పలికింది బాలాపూర్ లడ్డూ. ఇక లడ్డూ వేలం పాట అనంతరం.. బాలాపూర్ గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు కమిటీ సభ్యులు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







