ఇండియా నుంచి కువైట్ కు మరో రెండు కొత్త విమాన సర్వీసులు..
- September 19, 2021
కువైట్ సిటీ: సుమారు ఏడు నెలల తర్వాత భారత్, కువైట్ మధ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దీంతో ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ పెరిగిపోయింది. దీనిని దృష్టిలో పెట్టుకుని తాజాగా మరో రెండు కొత్త విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఇరు దేశాలకు చెందిన విమానయాన సంస్థలు ప్రకటించాయి. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ(SVPI) విమానాశ్రయం నుంచి కువైట్ కు ఈ విమాన సర్వీసులు ఉంటాయి. ఎయిర్ ఇండియా, కువైట్ ఎయిర్లైన్స్ ఈ విమాన సర్వీసులు నడపనున్నాయి.
అలాగే ఎస్వీపీఐ అధికారుల సమాచారం ప్రకారం లండన్కు కూడా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇరుదేశాల మధ్య కుదిరిన ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా ఈ విమాన సర్వీసు నడిపిస్తున్నట్లు ఎస్వీపీఐ వెల్లడించింది. కాగా, అంతర్జాతీయ ప్రయాణాలు మొదలైన తర్వాత మొట్టమొదట ఈ ఎయిర్పోర్టు నుంచి దుబాయ్కు తొలి విమానం నడిపినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే రూట్లో ఇటీవల అదనంగా మరో సర్వీసును కూడా నడిపిస్తున్నట్లు ఎస్వీపీఐ యాజమాన్యం పేర్కొంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







