ఇండియా నుంచి కువైట్ కు మరో రెండు కొత్త విమాన సర్వీసులు..
- September 19, 2021
కువైట్ సిటీ: సుమారు ఏడు నెలల తర్వాత భారత్, కువైట్ మధ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దీంతో ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ పెరిగిపోయింది. దీనిని దృష్టిలో పెట్టుకుని తాజాగా మరో రెండు కొత్త విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఇరు దేశాలకు చెందిన విమానయాన సంస్థలు ప్రకటించాయి. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ(SVPI) విమానాశ్రయం నుంచి కువైట్ కు ఈ విమాన సర్వీసులు ఉంటాయి. ఎయిర్ ఇండియా, కువైట్ ఎయిర్లైన్స్ ఈ విమాన సర్వీసులు నడపనున్నాయి.
అలాగే ఎస్వీపీఐ అధికారుల సమాచారం ప్రకారం లండన్కు కూడా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇరుదేశాల మధ్య కుదిరిన ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా ఈ విమాన సర్వీసు నడిపిస్తున్నట్లు ఎస్వీపీఐ వెల్లడించింది. కాగా, అంతర్జాతీయ ప్రయాణాలు మొదలైన తర్వాత మొట్టమొదట ఈ ఎయిర్పోర్టు నుంచి దుబాయ్కు తొలి విమానం నడిపినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే రూట్లో ఇటీవల అదనంగా మరో సర్వీసును కూడా నడిపిస్తున్నట్లు ఎస్వీపీఐ యాజమాన్యం పేర్కొంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్









