పంజాబ్ ముఖ్యమంత్రిగా సుఖ్జిందర్ సింగ్ రన్ధవా…
- September 19, 2021
చండీగఢ్: పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా సుఖ్జిందర్ సింగ్ రన్ధవాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.అమరీందర్ సింగ్ రాజీనామా తరువాత పంజాబ్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్నటి రోజున మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ పేరు తెరమీదకు వచ్చింది. ఆ తరువాత అంబికాసోనీ పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరశీలించింది. అనేకమంది పేర్లను పరిశీలించిన అధిష్టానం సుఖ్జిందర్ సింగ్ రన్ధవాను ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటనను కూడా విడుదల చేసింది. కాగా, కాసేపట్లో కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం అయ్యి రన్ధవాను తమ నాయకుడిగా ఎన్నుకోనున్నారు. మంత్రులు కూడా నిన్నటి రోజున రాజీనామా చేయడంతో కొత్త మంత్రివర్గంపై అప్పుడే కసరత్తులు మొదలయ్యాయి. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అమరీందర్ సింగ్ కొనసాగుతారా లేదంటే పార్టీ నుంచి పక్కకు తప్పుకొని భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెడతారా అన్నది చూడాలి.
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!







