పంజాబ్ ముఖ్యమంత్రిగా సుఖ్జిందర్ సింగ్ రన్ధవా…
- September 19, 2021
చండీగఢ్: పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా సుఖ్జిందర్ సింగ్ రన్ధవాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.అమరీందర్ సింగ్ రాజీనామా తరువాత పంజాబ్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్నటి రోజున మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ పేరు తెరమీదకు వచ్చింది. ఆ తరువాత అంబికాసోనీ పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరశీలించింది. అనేకమంది పేర్లను పరిశీలించిన అధిష్టానం సుఖ్జిందర్ సింగ్ రన్ధవాను ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటనను కూడా విడుదల చేసింది. కాగా, కాసేపట్లో కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం అయ్యి రన్ధవాను తమ నాయకుడిగా ఎన్నుకోనున్నారు. మంత్రులు కూడా నిన్నటి రోజున రాజీనామా చేయడంతో కొత్త మంత్రివర్గంపై అప్పుడే కసరత్తులు మొదలయ్యాయి. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అమరీందర్ సింగ్ కొనసాగుతారా లేదంటే పార్టీ నుంచి పక్కకు తప్పుకొని భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెడతారా అన్నది చూడాలి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







