పీఆర్సీఐ ఎక్స్లెన్స్ అవార్డులు గెలుచుకున్న LTMRHL
- September 19, 2021
హైదరాబాద్: ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్( LTMRHL) అత్యంత ప్రతిష్టాత్మకమైన పీఆర్సీఐ(పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)ఎక్స్లెన్స్ అవార్డులు 2021 వద్ద ప్లాటినమ్ అవార్డును సోషల్ మీడియాను అత్యుత్తమంగా వినియోగించుకున్నందుకు గానూ మరియు బ్రాంజ్ అవార్డును అత్యుత్తమ సమాచారం– కోవిడ్19 కు అందించినందుకుగానూ అందుకుంది.ఈ అవార్డుల వేడుకను గోవాలో నిర్వహించిన 15వ అంతర్జాతీయ కమ్యూనికేషన్ కాంక్లేవ్ వద్ద అందజేశారు.
గోవా ప్రభుత్వ సాంస్కృతిక శాఖామాత్యులు గోవింద్ గౌడే చేతుల మీదుగా ఈ అవార్డులను ఎల్టీఎంఆర్హెచ్ఎల్ కార్పోరేట్ కమ్యూనికేషన్ హెడ్ అనిందితా సిన్హా అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎల్టీఎంహెచ్ఆర్ఎల్ ఎండీ అండ్ సీఈవో కెవీబీ రెడ్డి మాట్లాడుతూ ‘‘ పీఆర్సీఐ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డులను అందుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. మా వరకూ సామాజిక మాధ్యమం అంటే మా వినియోగదారులతో నేరుగా కనెక్ట్ అయ్యే అత్యుత్తమ మార్గం.మా బ్రాండ్ వాగ్ధానం మరింతగా మెరుగుపరుచుకునేందుకు ఇది తోడ్పడుతుంది. సామాజిక మాధ్యమాల ద్వారా మా వినియోగదారుల అంచనాలను మించిన రీతిలో సేవలనందించేందుకు ఓ నూతన దృక్పధంను కోవిడ్ 19 మహమ్మారి అందించింది. మా ప్రయత్నాలకు ఈ అవార్డులు చక్కటి గుర్తింపు’’ అని అన్నారు.
తాజా వార్తలు
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్









