పీఆర్‌సీఐ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు గెలుచుకున్న LTMRHL

- September 19, 2021 , by Maagulf
పీఆర్‌సీఐ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు గెలుచుకున్న LTMRHL

హైదరాబాద్‌: ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ హైదరాబాద్‌ లిమిటెడ్‌( LTMRHL) అత్యంత ప్రతిష్టాత్మకమైన పీఆర్‌సీఐ(పబ్లిక్‌ రిలేషన్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా)ఎక్స్‌లెన్స్‌ అవార్డులు  2021 వద్ద  ప్లాటినమ్‌ అవార్డును సోషల్‌ మీడియాను అత్యుత్తమంగా వినియోగించుకున్నందుకు గానూ మరియు బ్రాంజ్‌ అవార్డును అత్యుత్తమ సమాచారం– కోవిడ్‌19 కు అందించినందుకుగానూ అందుకుంది.ఈ అవార్డుల వేడుకను గోవాలో నిర్వహించిన 15వ అంతర్జాతీయ కమ్యూనికేషన్‌ కాంక్లేవ్‌ వద్ద అందజేశారు.

గోవా ప్రభుత్వ సాంస్కృతిక శాఖామాత్యులు గోవింద్‌ గౌడే చేతుల మీదుగా ఈ అవార్డులను ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌ కార్పోరేట్‌ కమ్యూనికేషన్‌ హెడ్‌ అనిందితా సిన్హా అందుకున్నారు.

ఈ సందర్భంగా ఎల్‌టీఎంహెచ్‌ఆర్‌ఎల్‌ ఎండీ అండ్‌ సీఈవో కెవీబీ రెడ్డి మాట్లాడుతూ ‘‘ పీఆర్‌సీఐ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ  అవార్డులను అందుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. మా వరకూ సామాజిక మాధ్యమం అంటే మా వినియోగదారులతో నేరుగా కనెక్ట్‌ అయ్యే అత్యుత్తమ మార్గం.మా బ్రాండ్‌ వాగ్ధానం మరింతగా మెరుగుపరుచుకునేందుకు ఇది  తోడ్పడుతుంది. సామాజిక మాధ్యమాల ద్వారా మా వినియోగదారుల అంచనాలను మించిన రీతిలో సేవలనందించేందుకు ఓ నూతన దృక్పధంను కోవిడ్‌ 19 మహమ్మారి అందించింది. మా ప్రయత్నాలకు ఈ అవార్డులు చక్కటి గుర్తింపు’’ అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com