దుబాయ్ లో ఛారిటీ క్రికెట్ మ్యాచ్
- September 26, 2021
దుబాయ్: వ్యక్థుల ఆర్థిక స్థితిగతులు, సామర్థ్యాలతో సంబంధం లేకుండా అందరికీ విద్య అందాలనే సంకల్పంతో జైన్ సేవా మిషన్, ఎకోప్ ఛారిటీ సంయుక్తంగా ఓ సేవా కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్రత్యేకావసరాలుగల పిల్లలు, యంగ్ అడల్ట్స్ విద్య కోసం ఈ ఛారిటీ కార్యక్రమాలు పని చేయనున్నాయి. 5000 మంది సభ్యులుగల జైన్ సేవా సమితితో ఎకోప్ చేతులు కలిపింది. ఎకోప్, విమెన్ మరియు బాలికల ఉన్నతికి, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పలు కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఈ రెండు సంస్థలూ కలిసి ఛారిటీ కార్యక్రమంలో భాగంగా క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నాయి. ఐదుగురు స్పాన్సర్స్, 60 మంది ఆటగాళ్ళు, ఆరు టీములతో ఈ పోటీలు జరుగుతాయి. గుజరాత్లోని శ్రీ రాజ్ సౌభాగ్ ఆషీర్వాద్ ట్రస్ట్ ఫర్ డిజేబుల్డ్, రాష్ట్రీయ ప్రగ్యా ద్రిష్టి సంస్థాన్ - ఢిల్లీ, పెహ్చాన్ - ది సీక్రెట్ స్కూల్ ఢిల్లీ - ఎన్సీఆర్, తదితర సంస్థలకు చేయూతనిచ్చేందుకు జైన్ సేవా మిషన్ - ఎకోప్ ఛారిటీ కలిసి పనిచేస్తున్నాయి. echopecharity@gmail ద్వారా ఈ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తున్నారు నిర్వాహకులు.




తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









