ఆంధ్రప్రదేశ్లో క్యాడ్బరీ ప్లాంటు ఏర్పాటు
- March 17, 2016
ఆంధ్రప్రదేశ్లో చాక్లెట్ల తయారీకి క్యాబ్బరీ సంస్థ రంగం సిద్ధం చేసింది. శ్రీసిటీ సెజ్లో రూ.వెయ్యి కోట్లతో 134 ఎకరాల్లో ఆ సంస్థ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. మొత్తం 4 దశల్లో చేపట్టిన ప్లాంట్ నిర్మాణంలో తొలిదశ ప్రారంభానికి సిద్ధమైంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్లాంట్ అంతా సోలార్ పవర్ను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 25న క్యాడ్బరీ ప్లాంట్ తొలిదశ ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. హైదరాబాద్లో సీఎంతో భేటీ అయిన సంస్థ ప్రతినిధులు ఆహ్వానపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. క్యాడ్బరీ ప్లాంటు ఏర్పాటుతో రాష్ట్రంలో కోకో పంట సాగుకు ప్రాధాన్యం పెరిగిందన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







