ఆంధ్రప్రదేశ్‌లో క్యాడ్‌బరీ ప్లాంటు ఏర్పాటు

- March 17, 2016 , by Maagulf
ఆంధ్రప్రదేశ్‌లో క్యాడ్‌బరీ ప్లాంటు ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో చాక్లెట్ల తయారీకి క్యాబ్‌బరీ సంస్థ రంగం సిద్ధం చేసింది. శ్రీసిటీ సెజ్‌లో రూ.వెయ్యి కోట్లతో 134 ఎకరాల్లో ఆ సంస్థ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. మొత్తం 4 దశల్లో చేపట్టిన ప్లాంట్‌ నిర్మాణంలో తొలిదశ ప్రారంభానికి సిద్ధమైంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్లాంట్‌ అంతా సోలార్‌ పవర్‌ను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్‌ 25న క్యాడ్‌బరీ ప్లాంట్‌ తొలిదశ ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. హైదరాబాద్‌లో సీఎంతో భేటీ అయిన సంస్థ ప్రతినిధులు ఆహ్వానపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. క్యాడ్‌బరీ ప్లాంటు ఏర్పాటుతో రాష్ట్రంలో కోకో పంట సాగుకు ప్రాధాన్యం పెరిగిందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com