2016 హజ్ యాత్రకు వెళ్లాలని దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 20వ తేదీ వరకు కంప్యూటర్ డ్రా ...
- March 17, 2016
2016 హజ్ యాత్రకు వెళ్లాలని దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 20వ తేదీ వరకు కంప్యూటర్ డ్రా పద్ధతిలో ఎంపిక చేసేందుకు కేంద్ర హజ్ కమిటీ ప్రణాళికలు పూర్తి చేసింది. ఒకే రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ర్ర్టాలకు డ్రా తీసేందుకు ఏర్పాటు చేశారు. ఉదయం తెలంగాణ, మధ్యాహ్నం ఆంధ్ర ప్రాంతం హజ్ యాత్రికుల ఎంపిక జరుతుందని హజ్ కమిటీ అధికారులు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు 20వ తేదీ ఆదివారం కేంద్ర హజ్ కమిటీ అధికారులు డ్రా తీస్తారని చెప్పారు. కానీ ఇంకా అధికారికంగా డ్రా తేదీ ప్రకటించలేదని, ఒకటి, రెండు రోజలు పెరిగే అవకాశం కూడా ఉండవచ్చని రాష్ట్ర హజ్ కమిటీ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాల నుంచి 17,394 దరఖాస్తులు అందాయని, అందులో నగరం నుంచి 11,487 దరఖాస్తులు అందాయని ప్రత్యేక అధికారి తెలిపారు.ఈ ఏడాది 2011 రాష్ట్ర ముస్లిం జనాభా ఆధారం గా రాష్ర్టానికి హజ్ కోటా కేటాయిస్తారన్నారు. ఉపముఖ్యమం త్రి మహమూద్ అలీ, నగరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్రమంత్రి దత్త్తాత్రేయకు రాష్ట్ర హజ్ కోటా పెంపుకో సం విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







