2016 హజ్ యాత్రకు వెళ్లాలని దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 20వ తేదీ వరకు కంప్యూటర్ డ్రా ...
- March 17, 2016
2016 హజ్ యాత్రకు వెళ్లాలని దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 20వ తేదీ వరకు కంప్యూటర్ డ్రా పద్ధతిలో ఎంపిక చేసేందుకు కేంద్ర హజ్ కమిటీ ప్రణాళికలు పూర్తి చేసింది. ఒకే రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ర్ర్టాలకు డ్రా తీసేందుకు ఏర్పాటు చేశారు. ఉదయం తెలంగాణ, మధ్యాహ్నం ఆంధ్ర ప్రాంతం హజ్ యాత్రికుల ఎంపిక జరుతుందని హజ్ కమిటీ అధికారులు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు 20వ తేదీ ఆదివారం కేంద్ర హజ్ కమిటీ అధికారులు డ్రా తీస్తారని చెప్పారు. కానీ ఇంకా అధికారికంగా డ్రా తేదీ ప్రకటించలేదని, ఒకటి, రెండు రోజలు పెరిగే అవకాశం కూడా ఉండవచ్చని రాష్ట్ర హజ్ కమిటీ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాల నుంచి 17,394 దరఖాస్తులు అందాయని, అందులో నగరం నుంచి 11,487 దరఖాస్తులు అందాయని ప్రత్యేక అధికారి తెలిపారు.ఈ ఏడాది 2011 రాష్ట్ర ముస్లిం జనాభా ఆధారం గా రాష్ర్టానికి హజ్ కోటా కేటాయిస్తారన్నారు. ఉపముఖ్యమం త్రి మహమూద్ అలీ, నగరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్రమంత్రి దత్త్తాత్రేయకు రాష్ట్ర హజ్ కోటా పెంపుకో సం విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







