వేద ఎంటర్ప్రైజస్ వారి కొత్త చిత్రం..!
- March 17, 2016
వేద ఎంటర్ప్రైజస్ ప్రొడక్షన్స్లో ఓ కొత్త చిత్రం నిర్మాణానికి సిద్ధమవుతోంది. శ్రీకర బాబు దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ నూతన చిత్రాన్ని దగ్గుబాటి వరుణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి, ధీరేంద్ర, ప్రవీణ్, బిందు బార్బి, కారుణ్య చౌదరి, సాయాజీ షిండే తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో గురువారం ఈ చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ నెల 18 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. అమోఘ్ దేశపతి ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చుతున్నారు.

కథనం పూర్తిగా కామెడీ, హారర్గా కొనసాగుతుందని దర్శకుడు శ్రీకర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు డి. సురేశ్బాబు, అశోక్కుమార్, ప్రసన్నకుమార్, రేలంగి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!









