యూసఫ్ అలీకి అరుదైన గౌరవం..
- October 02, 2021
మస్కట్: కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, లులు గ్రూపు అధినేత, ఎన్నారై ఎంఏ యూసఫ్ అలీకి అరుదైన గౌరవం దక్కింది. ఒమన్ ప్రభుత్వం అలీకి లాంగ్-టర్మ్ రెసిడెన్సీ వీసా మంజూరు చేసింది. ఆ దేశంలో భారీగా పెట్టుబడులతో సంస్థలను నెలకొల్పడంతో పాటు భారీ మొత్తంలో దేశ పౌరులు, నివాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించిన సుమారు 21 మంది విదేశీ పారిశ్రామిక వేత్తలను తాజాగా ఒమన్ సర్కార్ ఇలా లాంగ్-టర్మ్ రెసిడెన్సీ వీసాలతో సత్కరించింది. వీరిలో ఎన్నారై యూసఫ్ అలీకి కూడా చోటు దక్కింది. ఒమన్ వాణిజ్య, పరిశ్రమ మరియు పెట్టుబడి ప్రోత్సాహక మంత్రి (MOICIIP) చేతుల మీదుగా ఆయన వీసా అందుకున్నారు. 'ఇన్వెస్టర్ రెసిడెన్స్' కార్యక్రమం ద్వారా విదేశీ పెట్టుబడిదారులకు ఒమన్ సుల్తానేట్ ఈ అవకాశం కల్పిస్తోంది.
ఈ కార్యక్రమం పెట్టుబడుల నాణ్యతను పెంపొందిస్తుంది. జీడీపీ వృద్ధికి దోహదపడుతుంది. మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. ఒమన్ విజన్-2040 సామర్థ్యాలు, లక్ష్యాలకు అనుగుణంగా జాతీయ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.అని వాణిజ్య, పరిశ్రమ మరియు పెట్టుబడి ప్రోత్సాహక మంత్రి సలహాదారు ఖలీద్ బిన్ సాయీద్ అల్ షుయిబి తెలిపారు. ఇక తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల యూసఫ్ అలీ హర్షం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా ఆయన పేర్కొన్నారు. ఒమన్ ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









