యూసఫ్ అలీకి అరుదైన గౌరవం..
- October 02, 2021మస్కట్: కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, లులు గ్రూపు అధినేత, ఎన్నారై ఎంఏ యూసఫ్ అలీకి అరుదైన గౌరవం దక్కింది. ఒమన్ ప్రభుత్వం అలీకి లాంగ్-టర్మ్ రెసిడెన్సీ వీసా మంజూరు చేసింది. ఆ దేశంలో భారీగా పెట్టుబడులతో సంస్థలను నెలకొల్పడంతో పాటు భారీ మొత్తంలో దేశ పౌరులు, నివాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించిన సుమారు 21 మంది విదేశీ పారిశ్రామిక వేత్తలను తాజాగా ఒమన్ సర్కార్ ఇలా లాంగ్-టర్మ్ రెసిడెన్సీ వీసాలతో సత్కరించింది. వీరిలో ఎన్నారై యూసఫ్ అలీకి కూడా చోటు దక్కింది. ఒమన్ వాణిజ్య, పరిశ్రమ మరియు పెట్టుబడి ప్రోత్సాహక మంత్రి (MOICIIP) చేతుల మీదుగా ఆయన వీసా అందుకున్నారు. 'ఇన్వెస్టర్ రెసిడెన్స్' కార్యక్రమం ద్వారా విదేశీ పెట్టుబడిదారులకు ఒమన్ సుల్తానేట్ ఈ అవకాశం కల్పిస్తోంది.
ఈ కార్యక్రమం పెట్టుబడుల నాణ్యతను పెంపొందిస్తుంది. జీడీపీ వృద్ధికి దోహదపడుతుంది. మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. ఒమన్ విజన్-2040 సామర్థ్యాలు, లక్ష్యాలకు అనుగుణంగా జాతీయ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.అని వాణిజ్య, పరిశ్రమ మరియు పెట్టుబడి ప్రోత్సాహక మంత్రి సలహాదారు ఖలీద్ బిన్ సాయీద్ అల్ షుయిబి తెలిపారు. ఇక తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల యూసఫ్ అలీ హర్షం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా ఆయన పేర్కొన్నారు. ఒమన్ ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..