టిఓఐఎఫ్ఎ ఫిలిం అవార్డ్స్ కోసం స్పెషల్ ఆర్టిఎ బస్సులు
- March 17, 2016
రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంకి ప్రత్యేక బస్సులను నడపనుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిలిం అవార్డ్స్ (టిఓఐఎఫ్ఎ) ప్రోగ్రామ్ సందర్భంగా ఈ ఏర్పాట్లను ఆర్టిఎ చేసింది. మాల్ ఆఫ్ ఎమిరేట్స్ మెట్రో స్టేషన్ నుంచి 25 బస్సుల్ని ఇందుకోసం వినియోగించనుంది. డేరా సిటీ సెంటర్, మరీనా మాల్, అల్ ఘుబైబా బస్ స్టేషన్, బుర్ దుబాయ్ వంటి ప్రాంతాల్లో ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. యూఏఈ వ్యాప్తంగా పెద్దయెత్తున టిఓఐఎఫ్ఎకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. షారుక్ఖాన్, అమితాబ్ బచ్చన్, రణ్వీర్సింగ్, రితేష్ దేశ్ముఖ్, పరిణీతి చోప్రా తదితరులు రెడ్ కార్పెట్పై సందడి చేయనున్నారు. షారుక్, సల్మాన్, కరీనాకపూర్, వరుణ్ ధావన్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ సహా పలువురు ప్రముఖులు తమ పెర్ఫామెన్స్లతో దుబాయ్ వాసుల్ని అలరించనున్నారు. టిఓఐఎఫ్ఎ 2016 అవార్డుల కార్యక్రమానికి టిక్కెట్ల ధరలు 199 దిర్హామ్ల నుంచి అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









