యెమెన్ లో టెర్రరిస్ట్ దాడిని ఖండించిన బహ్రెయిన్

- October 11, 2021 , by Maagulf
యెమెన్ లో టెర్రరిస్ట్ దాడిని ఖండించిన బహ్రెయిన్

బహ్రెయిన్ :  యెమెన్ వ్యవసాయ మంత్రి, ఏడెన్ సిటి గవర్నర్ కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకొని హౌతిస్ టెర్రరిస్టులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చాలా మంది పౌరులు చనిపోగా..పలువురికి గాయాలయ్యాయి. ఐతే ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు యెమెన్ మిత్ర దేశం బహ్రెయిన్ ప్రకటించింది. మానవత్వానికి మాయని మచ్చ లాంటి సంఘటన ఇది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దాడి లో చనిపోయిన వారికి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని బహ్రెయిన్ విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది. యెమెన్ కు ఎప్పుడు తమ సపోర్ట్ ఉంటుందని తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com