ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వందలాది మంది అరెస్ట్
- October 11, 2021కువైట్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ అధికారులు కొరడా ఝుళిపించారు. ఇటీవల ట్రాఫిక్ వాయలేషన్స్ అతిగా జరుగుతుండటంతో ట్రాఫిక్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రెండు రోజులుగా వాహనాల తనిఖీలు స్టార్ట్ చేశారు. ఈ తనిఖీల్లో దాదాపు 3506 మంది ట్రాఫిక్ వాయిలేషన్స్ కు పాల్పడినట్లు గుర్తించారు. వారికి నోటీసులు ఇచ్చారు. కొంతమందిని అరెస్ట్ చేశారు. 19 వాహనాలు జప్తు చేశారని అల్ అంబా పత్రిక రిపోర్ట్ లో తెలిపింది. 27 మంది జువైనల్స్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి జువైనల్స్ వాహనాలు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. వారందరినీ జువైనల్ హోమ్స్ కు తరలించారు. ట్రాఫిక్ నిబంధనలు విషయంలో కఠినంగా ఉంటామని ఈ సందర్భంగా అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత