ఎక్స్‌పో 2020 దుబాయ్: 10 రోజుల్లో 411,768 మంది సందర్శకులు

- October 11, 2021 , by Maagulf
ఎక్స్‌పో 2020 దుబాయ్: 10 రోజుల్లో 411,768 మంది సందర్శకులు

యూఏఈ: అధిక ఉష్ణోగ్రతలున్నా ఎక్స్‌పో 2020 దుబాయ్‌కి పెద్ద ఎత్తున సందర్శకులు పోటెత్తుతున్నారు. అక్టోబర్ 1న ఎక్స్‌పో ప్రారంభం కాగా, ఇప్పటి వరకూ 411,768 టికెటెడ్ విజిటర్స్ సందర్శించారు. పార్టిసిపెంట్లు, ఎగ్జిబిటర్స్ మరియు డెలిగేషన్స్ కాకుండా కేవలం సందర్శకుల సంఖ్యే ఇది. 175 దేశాల నుంచి సందర్శకులు వచ్చారు. ప్రతి ముగ్గురిలో ఒకరు విదేశీయులు. ప్రతీ ఐదుగురిలో ఒకరు, ఒకసారి కంటే ఎక్కువ సార్లు సందర్శించారు. డిజిటల్ వేదికగా 3 మిలియన్ల మంది ప్రారంభ వేడుకను తిలకించారు. 5 మిలియన్ల మంది వర్చువల్‌గా ఎక్స్‌పో దుబాయ్‌ని సందర్శించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com