భారత్ కరోనా అప్డేట్

- October 13, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరిగాయి.నిన్న విడుదల చేసిన బులిటెన్ ప్ర‌కారం 14 వేల కేసులు న‌మోద‌వ్వగా ఆ కేసులు ఇప్పుడు 15 వేల‌కు పైగా న‌మోద‌య్యాయి.తాజాగా భారత్‌లో 15,823 కేసులు న‌మోదైన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,40,01,743కి చేరింది.ఇందులో 3,33,42,901 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.2,07,653 కేసులు ప్ర‌స్తుతం యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్‌లో క‌రోనాతో 226 మంది మృతి చెందారు.దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 4,51,189 మంది మృతి చెందిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి.గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్‌లో 50,63,845 మందికి వ్యాక్సిన్ లు వేశారు.దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 96,43,79,212 మందికి వ్యాక్సిన్ లు అందించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com