కోవిడ్ థర్మల్ స్క్రీనింగ్ నిబంధనల్లో మార్పులు
- October 13, 2021
ఖతార్: మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, సరిహద్దులు మినహా ఖతార్లోని బహిరంగ ప్రదేశాల్లో COVID-19 కోసం థర్మల్ స్క్రీనింగ్ అవసరం లేదని ఖతార్ పబ్లిక్ హెల్త్ మంత్రిత్వ శాఖ (MoPH) స్పష్టం చేసింది. ఈ మేరకు COVID-19 థర్మల్ స్క్రీనింగ్ నిబంధనల్లో మార్పులు చేసినట్టు తన ట్విట్టర్ పేజీలో చేసిన పోస్ట్ లో ప్రకటించింది. ఇటీవల రోజువారీ కోవిడ్ కేసుల్లో తగ్గుదల ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఏదేమైనా, బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి గ్రీన్ ఎహతరాజ్ స్థితి ఇప్పటికీ తప్పనిసరి అని MoPH స్పష్టం చేసింది. అక్టోబర్ 3 నుంచి కోవిడ్ -19 ఆంక్షలను సడలించే నాల్గవ దశను ఖతార్ ప్రారంభించింది.ఈ దశలో బహిరంగ బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ లు ఉపయోగించడం, పబ్లిక్ ప్లేస్ లో పలు సౌకర్యాలు, మరుగుదొడ్లను తెరవడం వంటి విషయాల్లో సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే నాలుగో దశ నిబంధనల్లో మార్పుల తర్వాత ఖతార్ లో 100 శాతం సామర్థ్యంతో స్కూల్స్, విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం అయ్యాయి.
తాజా వార్తలు
- శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం వెబ్సైట్ ఆవిష్కరణ
- విద్యార్థులకు కొత్త రూల్ తీసుకొచ్చిన సీఎం రేవంత్
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!
- కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- ప్రజలకు అత్యవసర అలెర్ట్ జారీ చేసిన బహ్రెయిన్..!!
- ఒమన్లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- సౌదీ, GCC పౌరులు మే 3 వరకే అవకాశం..!!
- కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్సీసీ ప్రకటన..!!
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం









