నిజామాబాద్ లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత
- October 14, 2021తెలంగాణ: ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగ విశిష్టత గురించి తెలియజేసేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తన మెట్టినిల్లు నిజామాబాద్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ఈ నెల 23 న దుబాయ్ లో బతకమ్మ పండుగపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కూడా హాజరుకానున్నారని తెలిపారు.
ఒకప్పుడు బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి కోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తుచేసిన ఎమ్మెల్సీ కవిత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వమే ఘనంగా బతుకమ్మను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. బతుకమ్మ పండుగను అధికారంగా జరుపుకోవడం, బతుకమ్మ చీరలు ఇవ్వడం, తంగేడు రాష్ట్ర పువ్వు కావడం లాంటివన్నీ తెలంగాణ ఆడబిడ్డలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ రూపొందించిన బతుకమ్మ పాట ద్వారా, బతుకమ్మ పండుగపై మరోసారి దేశ విదేశాల్లో చర్చ జరిగిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నిజామాబాద్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మహిళా కమీషన్ సభ్యురాలు సుధాం లక్ష్మి, మేయర్ నీతూ కిరణ్, జిల్లా కలెక్టర్ సతీమణి మనీషా, పోలీస్ కమీషనర్ సతీమణి రీచా, జెడ్పీ ఛైర్మన్ సతీమణి అనసూయ, మహిళా ప్రజాప్రతినిధులు, ఆడబిడ్డలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!