నార్వేలో బాణాలతో దాడి, ఐదుగురు మృతి

- October 14, 2021 , by Maagulf
నార్వేలో బాణాలతో దాడి, ఐదుగురు మృతి

నార్వే : ఆగ్నేయ నార్వేలో ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. బాణాలతో ప్రజలపై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కోంగ్స్ బెర్గ్ పట్టణంలో ఈ దాడి జరిగింది. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ఉగ్రవాద కుట్రగా అనుమానిస్తున్నారు పోలీసులు. గాయపడిన ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గాయపడిన వారిలో ఓ పోలీస్ అధికారి ఉన్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ దాడిలో ఒక్కరే పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు 37ఏళ్ల డానిష్ పౌరుడనీ పోలీసులు తెలిపారు. గత కొంత కాలంగా ఇతను కోంగ్స్ బెర్గ్ లో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ప్రత్యేక్ష సాక్షిగా ఉన్న మహిళ అక్కడి మీడియాతో మాట్లాడింది. వీపు భాగంలో బాణాలు పెట్టుకొని చేతులో విల్లుపట్టుకున్న వ్యక్తి విచక్షణ రహితంగా బాణాలు విసిరాడని.. దీంతో అక్కడ ఉన్నవారు ప్రాణభయంతో పరుగులు తీశారని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com