తెలంగాణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- October 14, 2021
నిజామాబాదు: తెలంగాణలో బతుకమ్మ పండుగ సందడి ప్రారంభమైంది.తెలంగాణ నిజామాబాదు జిల్లా భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామములో ఘనంగా జరుపుకున్నారు.
ఇప్పటికే పట్నం వాసులు పల్లెటూర్లకి చేరుకున్నారు.ఆడపడచుల రాకతో ప్రతిఇంటా కోలాహలం మొదలైంది. బంధువులు, స్నేహితులతో రాష్ట్రంలోని పల్లెలన్నీ సందడి సందడిగా మారాయి.
తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుకల్లో మొదటి రోజు ఎంగిలిపూలు బతుకమ్మ నిర్వహిస్తారు.రోజుకో రకమైన పూలతో.. రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు.ఎంగిలి పూల బతుకమ్మ మహాలయ అమావాస్య రోజున మొదలవుతుంది. దీన్ని పెత్రామాస అని కూడా అంటారు.రాష్ట్రంలో ప్రతి ఆడపడుచు బతుకమ్మను స్వయంగా పేరుస్తుంది. వివిధ రకాల పూలతో.. భక్తిశ్రద్ధలతో.. పేరుస్తారు.సాయంత్రంపూట స్నేహితులు, బంధువులతో కలిసి ఆడబిడ్డలంతా ఎంతో సంబురంగా ఆడుకుంటారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









