సెప్టెంబర్‌లో 2,869 తనిఖీలు.. రెండు ఫుడ్ సంస్థలపై చర్యలు

- October 16, 2021 , by Maagulf
సెప్టెంబర్‌లో 2,869 తనిఖీలు.. రెండు ఫుడ్ సంస్థలపై చర్యలు

సౌదీ అరేబియా: అల్ రాయన్ మునిసిపాలిటీ అధికారులు నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడిన రెండు ఫుడ్ సంస్థలపై చర్యలు తీసుకున్నారు. సెప్టెంబర్‌లో మొత్తం 2,869 తనిఖీలు చేసిన అధికారులు.. 36 ఉల్లంఘనలు నమోదు చేశారు. అలాగే వీళ్ళపై చర్యలు తీసుకోవాలని ఒక నివేదికను భద్రతా అధికారులకు పంపించినట్లు మినిస్ట్రీ ఆఫ్ మున్సిపల్ అండ్ ఎన్విరాన్మెంట్ (MME) తెలిపింది. ఆహార సంస్థలపై మొత్తం 40 ఫిర్యాదులు నమోదు చేయబడ్డాయి. ఫుడ్ సేఫ్టీ విభాగం ఇన్స్పెక్టర్లు 3,265 స్లాటర్ హౌజ్ లలో తనిఖీలు నిర్వహించారు. 186 కిలోల మాంసాన్ని నాశనం చేశారు. అల్ సైలియా మార్కెట్‌లో 76,789 కిలోల కూరగాయలు, పండ్లను వినియోగానికి అనువుగా లేనందున నాశనం చేశామని, 46 నమూనాలను నాణ్యతా పరీక్ష కోసం పంపించినట్లు అధికారులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com