సెప్టెంబర్లో 2,869 తనిఖీలు.. రెండు ఫుడ్ సంస్థలపై చర్యలు
- October 16, 2021
సౌదీ అరేబియా: అల్ రాయన్ మునిసిపాలిటీ అధికారులు నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడిన రెండు ఫుడ్ సంస్థలపై చర్యలు తీసుకున్నారు. సెప్టెంబర్లో మొత్తం 2,869 తనిఖీలు చేసిన అధికారులు.. 36 ఉల్లంఘనలు నమోదు చేశారు. అలాగే వీళ్ళపై చర్యలు తీసుకోవాలని ఒక నివేదికను భద్రతా అధికారులకు పంపించినట్లు మినిస్ట్రీ ఆఫ్ మున్సిపల్ అండ్ ఎన్విరాన్మెంట్ (MME) తెలిపింది. ఆహార సంస్థలపై మొత్తం 40 ఫిర్యాదులు నమోదు చేయబడ్డాయి. ఫుడ్ సేఫ్టీ విభాగం ఇన్స్పెక్టర్లు 3,265 స్లాటర్ హౌజ్ లలో తనిఖీలు నిర్వహించారు. 186 కిలోల మాంసాన్ని నాశనం చేశారు. అల్ సైలియా మార్కెట్లో 76,789 కిలోల కూరగాయలు, పండ్లను వినియోగానికి అనువుగా లేనందున నాశనం చేశామని, 46 నమూనాలను నాణ్యతా పరీక్ష కోసం పంపించినట్లు అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









