ప్రవాసుల వర్క్ పర్మిట్ల వివాదం.. PAM డైరెక్టర్ జనరల్ సస్పెండ్
- October 16, 2021
కువైట్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్న్ పవర్ (PAM) అహ్మద్ అల్-మౌసాను మంత్రి పదవి నుంచి తొలగించారు. ప్రవాసుల వర్క్ పర్మిట్ల రెన్యువల్ కు సంబంధించి అతను తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు కమిటీ సిఫార్సు మేరకు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ బాధ్యతల నుంచి తొలగించారని స్థానిక అరబిక్ వార్తాపత్రికలు తెలిపాయి. గత సంవత్సరం యూనివర్సిటీ డిగ్రీ లేకుండా 60 ఏళ్లు పైబడిన ప్రవాసులకు వర్క్ పర్మిట్ల పునరుద్ధరణను నిలిపివేస్తూ డైరెక్టర్ జనరల్ నిర్ణయం తీసుకున్నారు. అయితే గత వారం, ఫత్వా, లెజిస్లేషన్ కమిటీ ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని పేర్కొంది. దీంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఈ నిర్ణయంతో చాలా మంది ప్రవాసులు తమ వర్క్ పర్మిట్ రెన్యువల్ కాకపోవడంతో కువైట్ నుండి వెళ్లిపోవలసి వచ్చింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







