గోపీచంద్ కొత్త చిత్రం ప్రారంభమయ్యింది
- June 06, 2015
గోపీచంద్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో 'భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుక శనివారం హైదరాబాద్లో జరిగింది. చిత్ర ముహూర్తపు సన్నివేశానికి శ్రీధర్ సీపాన క్లాప్ను ఇవ్వగా, నిర్మాత ఆనంద్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరిమాట్లాడుతూ.."ఆనంద్ ప్రసాద్ గారు నాకు దర్శకుడిగా జన్మనిచ్చారు. యజ్ఞం సినిమాతో గోపిచంద్ నాకు బ్రేక్ ఇచ్చాడు. గోపీచంద్తో మరోసారి పని చేయడం ఆనందంగా ఉంది. శ్రీధర్ సీపాన మంచి స్టొరీ ఇచ్చారు. కోన, గోపి గారితో కలిసి ఈ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది'' అన్నారు. గోపీచంద్ మాట్లాడుతూ "కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల, డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు తప్ప మిగతా వారందరూ లౌక్యం చిత్రానికి పనిచేసిన టీమ్తోనే మరోసారి పనిచేస్తున్నాను. యజ్ఞం వచ్చి పదేళ్లవుతుంది. ఆ సినిమా తర్వాత రవికుమార్ చౌదరిగారితో చేస్తున్న సినిమా ఇది. శ్రీధర్ సీపాన చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. లౌక్యం కంటే మంచి కామెడీ, హీరోయిజమ్, ఎమోషన్స్ ఉన్న సినిమా. తప్పకుండా మంచి చిత్రమవుతుంది'' అన్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్: అనూప్ రూబెన్స్, ఎడిటర్: గౌతంరాజు, కథ-మాటలు: శ్రీధర్ సీపాన, స్క్రీన్ ప్లే: కోనవెంకట్, గోపీమోహన్, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
తాజా వార్తలు
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్









