గోపీచంద్ కొత్త చిత్రం ప్రారంభమయ్యింది
- June 06, 2015
గోపీచంద్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో 'భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుక శనివారం హైదరాబాద్లో జరిగింది. చిత్ర ముహూర్తపు సన్నివేశానికి శ్రీధర్ సీపాన క్లాప్ను ఇవ్వగా, నిర్మాత ఆనంద్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరిమాట్లాడుతూ.."ఆనంద్ ప్రసాద్ గారు నాకు దర్శకుడిగా జన్మనిచ్చారు. యజ్ఞం సినిమాతో గోపిచంద్ నాకు బ్రేక్ ఇచ్చాడు. గోపీచంద్తో మరోసారి పని చేయడం ఆనందంగా ఉంది. శ్రీధర్ సీపాన మంచి స్టొరీ ఇచ్చారు. కోన, గోపి గారితో కలిసి ఈ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది'' అన్నారు. గోపీచంద్ మాట్లాడుతూ "కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల, డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు తప్ప మిగతా వారందరూ లౌక్యం చిత్రానికి పనిచేసిన టీమ్తోనే మరోసారి పనిచేస్తున్నాను. యజ్ఞం వచ్చి పదేళ్లవుతుంది. ఆ సినిమా తర్వాత రవికుమార్ చౌదరిగారితో చేస్తున్న సినిమా ఇది. శ్రీధర్ సీపాన చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. లౌక్యం కంటే మంచి కామెడీ, హీరోయిజమ్, ఎమోషన్స్ ఉన్న సినిమా. తప్పకుండా మంచి చిత్రమవుతుంది'' అన్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్: అనూప్ రూబెన్స్, ఎడిటర్: గౌతంరాజు, కథ-మాటలు: శ్రీధర్ సీపాన, స్క్రీన్ ప్లే: కోనవెంకట్, గోపీమోహన్, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







