ఉమ్రా కంపెనీలపై జరిమానాలను రద్దు
- October 22, 2021సౌదీ: వీసా నిబంధనలను ఉల్లంఘించారని పలు ఉమ్రా కంపెనీలకు విధించిన జారిమానాలను మక్కాలోని అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ రద్దు చేసింది. జరిమానా విధించే విషయంలో సంబంధిత అధికారులు నిబంధనలు పాటించలేదని ఉమ్రా కంపెనీలు అప్పిల్స్ కోర్టులో అప్పీల్ చేయడంతో ఈ మేరకు జరిమానాలను రద్దు చేస్తూ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఆరు గంటలు ఆలస్యంగా యాత్రికులు వచ్చారంటూ ఎనిమిది మంది ఉమ్రా ఆపరేటర్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. వీసా నిబంధనలను ఉల్లంఘించారంటూ సంబంధిత అధికారులు జరిమానాలు విధించారు. యాత్రికులు ఆలస్యంగా రావడం అనేది తమ నియంత్రణలో లేని అంశం అని.. జరిమానా నిర్ణయాన్ని సమీక్షించాలని కోరుతూ ఆపరేటర్లు.. హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖను ఆశ్రయించారు. వీసా ఉల్లంఘనకు సంబంధించిన అన్ని నిబంధనలను పరిశీలించిన తర్వాత జరిమానాలను రద్దు చేస్తూ కోర్టు తన తీర్పును వెలువరించింది.
తాజా వార్తలు
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్