దేశ పౌరులు, ప్రవాసులకు కువైట్ హెచ్చరిక!
- October 24, 2021
కువైట్: కువైట్ సమాచార మంత్రిత్వశాఖ దేశ పౌరులు, ప్రవాసులకు తాజాగా కీలక సూచన చేసింది. గుర్తుతెలియని వ్యక్తులు పంపించే సందేశాలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఆగంతకుల నుంచి వచ్చే ఈ-మెయిల్స్, ఎలక్ట్రానిక్ లింక్స్కు స్పందించకపోవడం మంచిదని తెలియజేసింది. మీకు పార్శిల్ వచ్చిందంటూ నివాసితులకు ఇలా సంబంధంలేని లింక్స్ పంపించి కొందరు కేటుగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్న సంఘటనలు దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా మంత్రిత్వశాఖ ఈ అలెర్ట్ జారీ చేసింది.
అందుకే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పార్శిల్ పేరుతో వచ్చే ఎలక్ట్రానిక్ లింక్స్కు నగదు పంపించి మోసపోవద్దని సంబంధిత అధికారులు ప్రవాసులు, దేశ పౌరులను సూచించారు. ఈ మేరకు మంత్రిత్వశాఖ అధికారిక సోషల్ మీడియా వెబ్సైట్స్లో కూడా ప్రత్యేక ప్రకటనలు ఇచ్చింది. ఇలా ఎదైనా అనుమానాస్పద లింక్స్ వస్తే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు కోరారు. సాధ్యమైనంత వరకు ఈ ఫేక్ మెసేజ్లకు స్పందించవద్దని చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి