13 ఎయిర్‌పోర్టులను అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వం

- October 26, 2021 , by Maagulf
13 ఎయిర్‌పోర్టులను అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వం

న్యూ ఢిల్లీ: వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దేశంలో 13 ఎయిర్‌పోర్టులను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. కేంద్ర ప్రభుత్వం అమ్మేయాలని భావిస్తున్న 13 ఎయిర్‌పోర్టుల్లో 6 పెద్దవి, 7 చిన్నవి ఉన్నాయి. పెద్ద విమానాశ్రయాల జాబితాలో అమృత్ సర్, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, తిరుచ్చి, వారణాసి ఉన్నాయి. చిన్న ఎయిర్‌పోర్టుల జాబితాలో సేలం (తమిళనాడు), జలగాం (ఛత్తీస్‌గఢ్), జబల్ పూర్(మధ్యప్రదేశ్), కంగ్రా (పంజాబ్), గయ (యూపీ), ఖుషీ నగర్ (యూపీ), జర్సుగూడ (ఒడిశా) ఉన్నాయి.పెద్ద విమానాశ్రయాలను చిన్న ఎయిర్‌పోర్టులతో కలిపి వేలం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com