కృష్ణవంశీ సినిమా కోసం ముందుకు వచ్చిన చిరంజీవి
- October 26, 2021
హైదరాబాద్: క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ప్రస్తుతం తన తదుపరి సినిమా అయిన "రంగమార్తాండ" నిర్మాణాంతర పనులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరాఠీ లో సూపర్ హిట్ అయిన సినిమా "నటసామ్రాట్" కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. "రంగమార్తాండ" సినిమాలో ప్రకాష్ రాజ్ మరియు రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఈ ఏడాది ఆఖరులో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర డబ్బింగ్ పనులను మొదలు పెట్టారు కృష్ణవంశీ. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి నీ బ్యాగ్రౌండ్ వాయిస్ ఇచ్చేందుకు సంప్రదించగా మెగాస్టార్ కూడా ఒప్పుకున్నారు.
ఈ విషయాన్ని షేర్ చేస్తూ మెగాస్టార్ కి కృతజ్ఞతలు కూడా సోషల్ మీడియా ద్వారా తెలిపారు కృష్ణవంశీ. శివాత్మిక, ఆదర్శ్ బాలకృష్ణ మరియు రాహుల్ సిప్లిగంజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కానీ విడుదల తేదీ గురించి మాత్రం అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్టుగా ఓటీటీ ప్లాట్ఫారం లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారు కానీ సినిమా థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుంది అని దర్శక నిర్మాతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో వేచి చూడాల్సి ఉంది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







