కేవలం 392 దిర్హాములకే భారత్ ప్రయాణం
- October 27, 2021యూఏఈ-ఇండియా విమానాలు: యూఏఈ లోని అల్ ఐన్-కోజికోడ్ సర్వీసును 392 దిర్హామ్లతో పునఃప్రారంభించింది ఎయిరిండియా ఎక్స్ప్రెస్. వివరాల్లోకి వెళితే..
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వచ్చే నెల నుండి అబుదాబిలోని అల్ ఐన్ నుండి కేరళలోని కోజికోడ్ వరకు తన సేవలను పునఃప్రారంభిస్తున్నట్లు ఎయిర్లైన్ అబుదాబి కార్యాలయం తెలిపింది.
కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి యూఏఈ లో తీసుకున్న దేశవ్యాప్త ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మార్చి 2020లో విమాన సర్వీసు నిలిపివేయబడింది. తిరిగి సర్వీసులను ప్రారంభిస్తుండటంతో, విమానయాన సంస్థ ప్రయాణికులకు Dh392 నుండి ప్రత్యేక టిక్కెట్ ధరను అందిస్తోంది.
మొదటి ఫ్లైట్ నవంబర్ 4 నుండి ప్రారంభమవుతుంది. వారానికి ఒక ఫ్లైట్ చొప్పున ప్రతి గురువారం ఈ ఫ్లైట్ అందుబాటులో ఉంటుంది. అనగా, మొదటి ఫ్లైట్ (IX 0335) కోజికోడ్ నుండి టేకాఫ్ అయ్యి మధ్యాహ్నం 12.25 గంటలకు అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది. అదే రోజు అల్ ఐన్ నుండి తిరుగు ప్రయాణం (IX 0336) మధ్యాహ్నం 1.25 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుంది.
తాజా వార్తలు
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు